ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ ఉయ్యాల వాడ : నంద్యాల జిల్లాలోని, ఉయ్యాలవాడ మండలంలో పి ఆర్ టి యు సభ్యత్వ నమోదును జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్.వి.భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ సందర్భంగా మండలంలోని, పలు పాఠశాలలు సందర్శించి వారి సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తామని తెలిపారు. డిఎస్సి-2003 ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వ మెమో 57 ప్రకారం పాత పెన్షన్ అమలు చేయాలని కోరారు. సిపిఎస్ రద్దు చేయాలని, అందుకు సంబంధించిన కార్యాచరణ చేపట్టాలని కోరారు. పిఆర్సి కమిషన్ ఏర్పాటు, మధ్యంతర భృతి ఐఆర్ 30% ఇవ్వాలని కోరారు. మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు సర్వీస్ రూల్స్ రూపొందించి, వారి సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఉపాధ్యాయుల పెండింగ్ డిఎ బకాయిలు, సరెండ్ లీవ్, ఏపీజిఎల్ఐ క్లెయిమ్స్ తదితరాలు చెల్లించాలని కోరారు. అదేవిధంగా 1 నుంచి 10 తరగతులు ఒకే చోట కొనసాగుతున్న పాఠశాలల్లో 1-5 & 6-10 గా వేరు చేసి ప్రత్యేక డైస్ కోడ్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ కమిటీ నాయకులు రమణయ్య,జిల్లా ఆడిట్ కమిటీ కన్వీనర్ లక్ష్మణ్ రావు, జిల్లా కౌన్సిలర్ నాగేశ్వరరావు, మండల గౌరవ అధ్యక్షుడు పోచ శ్రీనివాస్ రెడ్డి, మహానంది మండలం అధ్యక్షుడు డి.దస్తగిరి, మండల నాయకులు భాషా, విజయరాజు, తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News