Wednesday, 01 April 2026 01:55:59 AM
# లక్షెట్టిపేటలో భక్తిశ్రద్ధలతో హనుమాన్ చాలీసా పారాయణం.. # మానవ తప్పిదాల వల్లే రోడ్డు ప్రమాదాలు # షెడ్యూల్డ్ కులముల నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. # గ్రామ పంచాయతీలకు 247.94 కోట్ల నిధులు విడుదల... # అమెరికా సామ్రాజ్యవాద విధానాలు నశించాలి - ఇరాన్ పై యుద్ధం ఆపాలి... # నిరుపేదలకు అండగా సీఎం రిలీఫ్ ఫండ్... # 14,15 సంవత్సరాల వయసు బాలికలు హెచ్ పి వి వ్యాక్సిన్ వేయించుకోవాలి.. # మే నుంచి తెలుగు రాష్ట్రాల్లో జనగణన ప్రక్రియ ప్రారంభం.. # లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఎస్సై # మంచిర్యాలలో ప్రజాపాలన స్పెషల్ డ్రైవ్.... # బిజెపి రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కార్యవర్గ సభ్యులుగా చల్ల నారాయణరెడ్డి, చంద్రుపట్ల సునీల్ రెడ్డి # కాళేశ్వర దేవస్థాన డైరెక్టర్ గా బిసుల నర్సయ్య # కేసీఆర్ వల్లే నాకు గుర్తింపు వచ్చింది... # తెలంగాణ శాసనమండలి నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీల సస్పెన్షన్... # శ్రీ హిందూ కుటుంబీకులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే.. # తెలంగాణ జాగృతి'లో భారీ చేరికలు... # ఉచిత కూరగాయల వి త్తనాలను రైతులు సద్విని యోగం చేసుకోవాలి # నేతకాని సమాజ అభ్యున్న తికి ఫౌండేషన్ ఏర్పాటు- # మహానంది అవార్డు అందుకున్నహనూష్ కుమార్... # జర్నలిస్టులు ఏప్రిల్ 6 వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోండి...

మానవ తప్పిదాల వల్లే రోడ్డు ప్రమాదాలు

సీపీ.గౌస్ ఆలం...

Date : 31 March 2026 10:40 PM Views : 9

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : రోడ్డు ప్రమాదాల నివారణ కేవలం పోలీసుల చర్యల తోనే సాధ్యం కాదని, వాహనదారులు ట్రాఫిక్ నిబంధనల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండి, వాటిని బాధ్యతా యుతంగా పాటించినప్పు డే ప్రమాద రహిత సమా జం సాధ్యమవుతుందని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం అన్నారు. మంగళవారం కరీంనగర్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో, ఆటో డ్రైవర్లు , రాపిడో కెప్టెన్ల కోసం స్థానిక అస్త్ర కన్వెన్షన్ హాల్ నందు మంగళవారం ఏర్పాటు చేసిన ‘అరైవ్ - అలైవ్’ మూడవ దశ అవగాహనా కార్యక్రమానికి సీపీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.​​ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూమానవ తప్పిదాలే మరణ శాసనంగా మారుతున్నాయన్నారు. గత ఏడాది కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాల వల్ల 200 మం ది ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని సీపీ ఆవేదన వ్యక్తం చేశారు. హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించకపోవడం, అతి వేగం, మద్యం సేవించి వాహనం నడపడం వంటి అజాగ్రత్త ల వల్లే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నా యని తెలిపారు. ​బాధితుల్లో పురుషులే ఎక్కువ, ప్రమాదాల్లో మరణించిన వారిలో 85 శాతం మంది పురుషులే ఉండటం గమనార్హమని, ఒక వ్యక్తి మరణం ఆ కుటుంబం మొత్తాన్ని వీధిన పడేస్తుందని గుర్తు చేశారు.​బ్లాక్ స్పాట్లపై నిఘా ఏర్పాట్లు చేశామన్నారు. కరీం నగర్ నుండి హైదరాబాద్, వరంగల్, జగిత్యాల, సిరి సిల్ల మరియు చొప్పదండి వెళ్లే రహదారుల్లో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్న ‘బ్లాక్ స్పాట్లను’ గుర్తించామని అన్నారు.అక్కడ గుర్తించిన బ్లాక్ స్పాట్ల వద్ద ప్రత్యేక నిఘాతో పాటు హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా హుజురాబాద్ లింగాపూర్ క్రాస్ రోడ్డు వద్ద ఇప్పటికే సైన్ బోర్డులు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రతి డ్రైవర్ పరిసరాలను గమనిస్తూ వాహనం నడిపే ‘డిఫెన్సివ్ డ్రైవింగ్’ పద్ధ తిని అలవరచుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో పోలీసు సిబ్బందితోపాటు పలు రకాల వాహనాలు నడిపే డ్రైవర్లు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :