ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : గిరిజనుల ఆరాధ్య దైవమైన కొమరం భీమ్ వర్ధంతిని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటాలతో పాటు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పలు వురు ఆదివాసీ నాయకులు మాట్లాడుతూ జల్ జంగల్ జమీన్ కోసం పోరాడుతూ ప్రాణాలు వదిలారని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఆదివాసీ ఆరాధ్య దైవం కొమురం భీం 85వ వర్ధంతి సందర్భంగా నెరడిగొండ మండలంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కొమరం భీమ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ జల్ జంగల్ జమీన్ కోసం పోరాడిన ఆదివాసీ ఆరాధ్య దైవం కొమురం భీం జ్ఞాపకార్థం ఆసిఫాబాద్ జిల్లా జోడేఘాట్ లో గత ముఖ్యమంత్రి కేసీఆర్ రూ. 25 కోట్లతో మ్యూజియం నిర్మించారని గుర్తుచేశారు. మావ నాటే మావ రాజ్ కళను సాకారం చేసి వారి గ్రామాల్లో వారికే అధికారం ఇచ్చిన ఘనత కేసీఆర్ దని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News