ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : అక్రిడియేషన్ తో సంబంధం లేకుండా జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ డెమొక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వర్కింగ్ డీజేఎఫ్ డబ్ల్యూ ఆధ్వర్యంలో బుధవారం పెద్దపెల్లి కలెక్టరేట్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా డీజేఎఫ్ డబ్ల్యూ నాయకులు మాట్లాడుతూ జిల్లాలో గత కొన్ని సంవత్సరాలుగా వివిధ పత్రికలు, చానల్స్ లో రిపోర్టర్లుగా పనిచేస్తూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా తమ బాధ్యతను నిర్వర్తిస్తూ ఉంటారు. అందులో చాలామంది పేదరికంతో ఉన్న కుటుంబాలే ఎక్కువగా ఉన్నాయని, కనీసం సొంత ఇల్లు లేక కిరాయి ఇళ్లలో ఉంటూ ఆర్థిక ఇబ్బందులతో జర్నలిస్టులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. సొంత ఇల్లు లేని జర్నలిస్టులకు అద్దె చెల్లించడం భారంగా మారిందన్నారు.10 సంవత్సరాలు అధికారంలో ఉన్న ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఊకదంపుడు ఉపన్యాసాలు చేసి కాలం వెళ్లదీసిందన్నారు. జర్నలిస్టు సమస్యల నిర్లక్ష్యానికి పర్యవసానం, మూల్యం బిఆర్ఎస్ పార్టీ చెల్లించుకుంది. ప్రస్తుత అధికార కాంగ్రెస్ ప్రభుత్వం అదే కోవలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ అధికారంలోకి వస్తే జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తామని,ఇండ్ల స్థలాలు అందిస్తామని హామీ ఇచ్చిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు జిల్లాలో అర్హులైన జర్నలిస్టులను గుర్తించి వెంటనే ఇండ్ల స్థలాలు కేటాయించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధి రాష్ట్ర అధ్యక్షులు కోల శ్రీనివాస్, జాతీయ పిఆర్ఓ మామిడి స్వామి, మహిళా అధ్యక్షురాలు వోడ్నాల లత, ప్రధాన కార్యదర్శి కన్నూరి జేష్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు వెన్నంపల్లి శ్రీనివాస్, రావుల రాజ్ కుమార్, జిల్లా ప్రచార కార్యదర్శి మాదేశి శ్రావణ్ కుమార్ జర్నలిస్టులు మంథని లక్ష్మణ్, అసంపల్లి స్వామి, బంధాల రాజశేఖర్, బడికెల కృష్ణ, వోడ్నాల తిరుపతి, షకీల్ తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News