ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కుంరం భీం ఆసిపాబాద్ జిల్లా ఆదివాసి మహిళ ఎమ్మెల్యే కోవలక్ష్మి పై మంచిర్యాల జిల్లా క్యాతన్ పల్లి సంఘటనలో ఏ 12 గా చూపిస్తూ అక్రమంగా కేసు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆదివాసి నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బుధవారం జిల్లా సర్మీడి దుర్గు పటేల్ మాట్లాడుతూ రక్షణ కల్పించవలసిన పోలీసులు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే సంఘటన స్థలంలోకి సానుభూతి తెల్పడాన్నికి వెళితే మహిళా పోలీసులను అడ్డంపెట్టి రాజ్యాంగ బద్ధంగా ప్రజల ద్వారా ఎన్నుకోబడిన ఒక ఆదివాసి మహిళ ఎమ్మెల్యే అని కూడ చూడకుండ ఎప్పుడు లేని విధంగా మహిళా పోలీసులను అడ్డం పెట్టి ఎమ్మెల్యే ని నెట్టు కుంటూ తీసుకు వెళ్లడం ఎంతవరకు న్యాయమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా ఆదివాసి మహిళ ఎమ్మెల్యే పై కేసు బనాయించడాన్నీ, ఆదివాసీ సంఘాలతో పాటు జిల్లా సర్మీడి మండల బీ ఆర్ఎస్ నాయకులందరు తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కుట్రపూరిత చర్యలకు పాల్పడితే ఊరుకునేది లేదని, స్థానిక కాంగ్రెస్ నాయకులతో పాటు ఎమ్మెల్యేలఇళ్లు ముట్టడిస్తామని, తుడుం దెబ్బ ఆదివాసి సంఘాలు ఆదివాసీ సమాజం తరఫున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందోళన కార్యక్రమాలు చేపట్టాక తప్పదని హెచ్చరించారు. తక్షణమే కోవ లక్ష్మి పైన పెట్టిన అక్రమ కేసును ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నార్నూర్ మండలం బీ ఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News