Thursday, 30 July 2026 12:09:51 PM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

బీటీ రోడ్ల నిర్మాణాలకు రూ. 43.93 కోట్ల నిధులు మంజూరు

Date : 25 December 2025 12:50 AM Views : 230

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మంథని నియోజకవర్గం పరిధిలోని ఆయా మండలాలలో 14 బీటీ రోడ్ల నిర్మాణాలకు (12 సిఆర్ఆర్, 2 డిఎంఎఫ్ టి గ్రాంట్ల ద్వారా) రూ. 43.93 కోట్ల నిధులను బుధవారం ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మంజూరు చేయించారు. మంథని నియోజకవర్గంలోని నర్సింగాపూర్ జెడ్పీ రోడ్ నుండి పాత రేగులగూడెం వరకు రూ. 2.30 కోట్లు, పిడబ్ల్యుడి రోడ్ కాటారం నుండి సబ్ స్టేషన్ పల్లి వయా దుబ్బగూడెం వరకు రూ. 3 కోట్లు, నాగారం ఎక్స్ రోడ్ నుండి కన్నాల వేంకటేశ్వర స్వామి టెంపుల్ వరకు రూ. 2.50 కోట్లు, వల్లెంకుంట నుండి మానేరు వరకు రూ. 1.80 కోట్లు, గుమ్నూర్ పిడబ్ల్యుడి రోడ్డు నుండి దొంతులపల్లి మీదుగా పిడబ్ల్యుడి రోడ్డు కాకర్లపల్లి వరకు రూ. 3.75 కోట్లు (డిఎంఎఫ్ టీ గ్రాంటు), మహదేవ్ పూర్ నుండి గోదావరి వయా ఫకీర్ వాడ వరకు రూ. 3 కోట్లు, హరిపురం నుండి పోతారం వయా ట్యాంక్ బండ్ రూ. 2 కోట్లు, చిన్న ఓదెల నుండి మానేరు వరకు 1 కోటి, Widening & Strenghthening రోడ్డు పెంచికల్ పేట్ నుండి ఎఫ్ సిఐ గేట్ వరకు రూ. 9.90 కోట్లు (Old 4cr), (డిఎంఎఫ్ టీ గ్రాంటు), పిడబ్ల్యుడి రోడ్ నుండి విలోచవరం వయా అయ్యగారి చెరువు వరకు రూ. 3.62 కోట్లు, కన్నాల నుండి మల్లేపల్లి వరకు రూ. 1.82 కోట్లు, పిడబ్ల్యుడి రోడ్ నుండి గోదావరి వయా పలిమెల వరకు రూ. 3.24 కోట్లు, ఆర్ అండ్ బి రోడ్డు సుబ్బయ్యపల్లి నుండి ఆర్ అండ్ బి రోడ్డు ప్రతాపగిరి వరకు రూ. 3.50 కోట్లు, బిటి రోడ్డు బెగ్లూర్ నుండి గోదావరి వయా హనుమాన్ టెంపల్ వరకు రూ. 2.50 కోట్లు మంజూరయ్యాయి. మంజూరైన 14 బిటి రోడ్లకు సంబంధించిన ఆయా గ్రామాల ప్రజలు, ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మంత్రి శ్రీధర్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :