Friday, 19 June 2026 01:25:55 PM
# 26 నఖరీఫ్ సీజన్ కు రైతు భరోసా అందించనున్న ప్రభుత్వం... # చికిత్స పొందుతూ యువకుడు మృతి # ఎల్.పి.జి.వినియోగదారులు బ్యాంకు ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలి... # రుద్రంగి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గల్ఫ్ కార్మికుడు మృతి... # కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన సిర్పూర్ ఎమ్మెల్యే.. # నకిలీ, నాణ్యతలేని విత్తనాలపై ఉక్కుపాదం...! 220 దుకాణాల తనిఖీ.. 18 మందిపై 7 కేసులు 10.20 లక్షల విలువైన 1,181 పత్తి విత్తన ప్యాకెట్లు స్వాధీనం.. # పాఠశాల అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి.. # సేవా కార్యక్రమాలకు గౌరవ డాక్టరేట్ పురస్కారం అందుకున్న మడే రాజేష్ # జన్యుపరమైన అనారోగ్యంతో పోరాడుతున్న హనుమకొండకు చెందిన నిరంజన్..!అభిమాని నిరంజన్ ను పరామర్శించినపవన్ కళ్యాణ్... # ఆదివాసి మహిళలను చెప్పులతో కొట్టిన ఫారెస్ట్ అధికారులును వెంటనే సస్పెండ్ చేయాలి... # జిల్లాలో వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి.. # రైతు వేదికల్లో విత్తనాలు, ఎరువుల పంపిణీ .. ! కేంద్రం పైన ఎప్పటికప్పుడు ఒత్తిడి.. # మంచిర్యాలలో ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులపై ఆర్టీఏ కొరడా.. 5 బస్సులు సీజ్ # వృద్ధాప్యంలో కొండంత అండ: రూ. 30 లక్షల ప్రమాద బీమా, రూ. 10 లక్షల సహజ మరణ బీమా కల్పించడం పట్ల సర్వత్రా హర్షం... # తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలికి ఘన స్వాగతం.. # ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని 100 శాతం విజయవంతం చేయాలి.. # ఎమ్మెల్యే పై కవిత అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.. # అంగన్‌వాడీలే చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాదులు. మంత్రి సీతక్క.. # రైతులకు విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.. # ఇందిరమ్మ ఇళ్లకు 77 లక్షల దరఖాస్తులు.. స్థలం లేనివారికీ మంజూరు..

ఆటో డ్రైవర్లకు భూక్యా జాన్సన్ నాయక్ భరోసా

నియోజకవర్గ ఆటో డ్రైవర్లందరికీ ప్రమాద బీమా కల్పిస్తానని ప్రకటించిన భూక్యా జాన్సన్ నాయక్

Date : 26 January 2026 11:30 PM Views : 154

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలోని అన్ని మండలాల ఆటో డ్రైవర్లకు తన వంతు సహాయంగా రూ.5 లక్షల ప్రమాద బీమా ప్రీమియం నేనే చెల్లిస్తానని మరోసారి జాన్సన్ నాయక్ తన మంచి మనసును చాటుకున్నారు. సోమవారం ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రంలోని బస్టాండ్ వద్ద ఆటో డ్రైవర్లతో సమావేశమైన జాన్సన్ నాయక్ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లపై కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని తీవ్రంగా విమర్శించారు. గత పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వం ఆటో కార్మికులకు ఎల్లప్పుడూ అండగా నిలిచిందని. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోతున్నదని రూ.5 లక్షల బీమా రద్దు చేసి ఆటో అన్నలకు కాంగ్రెస్ ప్రభుత్వం ద్రోహం చేసిందని. కేసీఆర్ గారి ప్రభుత్వం అసంఘటిత రంగ కార్మికులకు రైతు బీమా తరహాలో రూ.5 లక్షల ప్రమాద బీమాను అమలు చేసిందని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అక్టోబర్ నుంచి బీమా ప్రీమియం చెల్లించకపోవడంతో ఆటో డ్రైవర్లు ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఆటో డ్రైవర్‌కు రూ.24,000 కాంగ్రెస్ బాకీ నెలకు రూ.1,000 చొప్పున (సంవత్సరానికి రూ.12,000) సహాయం చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చినా రెండేళ్లు గడుస్తున్నా ఆ హామీని నెరవేర్చలేదని రెండు సంవత్సరాలకు కలిపి ప్రతి ఆటో డ్రైవర్‌కు ప్రభుత్వం రూ.24,000 బాకీ ఉందని ఆ బాకీని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే 100 రోజుల్లో ఏర్పాటు చేస్తామని చెప్పిన సంక్షేమ బోర్డును కూడా ఇంకా ఏర్పాటు చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. ఖానాపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు 3000 మంది పైన ఆటో డ్రైవర్లు ఉన్నారని వారికి ప్రభుత్వం బీమా కట్టకపోవడంతో వ్యక్తిగతంగా తానే బీమా ప్రీమియం చెల్లిస్తానని జాన్సన్ నాయక్ ప్రకటించారు. దీని ద్వారా ప్రభుత్వానికి సిగ్గు వచ్చి రాష్ట్రవ్యాప్తంగా డ్రైవర్లందరికీ బీమా చెల్లించే పరిస్థితి రావాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న ఆటో డ్రైవర్లు జాన్సన్ నాయక్ గారికి హృదయాపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ల అద్యక్షులు ఆటో డ్రైవర్లు మాజీ ప్రజా ప్రతినిధులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :