Wednesday, 17 June 2026 01:34:26 PM
# ఆదివాసి మహిళలను చెప్పులతో కొట్టిన ఫారెస్ట్ అధికారులును వెంటనే సస్పెండ్ చేయాలి... # జిల్లాలో వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి.. # రైతు వేదికల్లో విత్తనాలు, ఎరువుల పంపిణీ .. ! కేంద్రం పైన ఎప్పటికప్పుడు ఒత్తిడి.. # మంచిర్యాలలో ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులపై ఆర్టీఏ కొరడా.. 5 బస్సులు సీజ్ # వృద్ధాప్యంలో కొండంత అండ: రూ. 30 లక్షల ప్రమాద బీమా, రూ. 10 లక్షల సహజ మరణ బీమా కల్పించడం పట్ల సర్వత్రా హర్షం... # తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలికి ఘన స్వాగతం.. # ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని 100 శాతం విజయవంతం చేయాలి.. # ఎమ్మెల్యే పై కవిత అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.. # అంగన్‌వాడీలే చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాదులు. మంత్రి సీతక్క.. # రైతులకు విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.. # ఇందిరమ్మ ఇళ్లకు 77 లక్షల దరఖాస్తులు.. స్థలం లేనివారికీ మంజూరు.. # పేదింటి ప్రజల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ధ్యేయం # పేద ప్రజలకు న్యాయం చేసే వరకు పోరాడుతా # ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన కవిత # సింగరేణి సంస్థ సర్వతోముఖాభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దాం… # ఉప ముఖ్యమంత్రిబట్టి విక్రమార్క ను సన్మానించిన మాజీ ఎమ్మెల్యే... # మునీర్ భాయ్ పుస్తకావిష్కరణ లో పాల్గొన్న మంత్రి వివేక్ # అమావాస్య రోజు మోగనున్న బడిగంటలు.. # ప్రజల మధ్యలో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ # కార్మిక సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..! బిజెపి, బి ఆర్ ఎస్ కుట్రలను సాగనివ్వం...

షహీద్ భగత్ సింగ్ పోరాట వారసత్వాన్ని కొనసాగించాలి...

మంచిర్యాల లో భగత్ సింగ్ సంస్మరణ సభ..

Date : 23 March 2026 10:03 PM Views : 110

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : భరతమాత దాస్య విముక్తి కోసం పోరాడి ఉరికంబాన్ని ముద్దాడిన షహీద్ భగత్ సింగ్ స్ఫూర్తితో దేశ ప్రజలు సమస్యల సాధన కోసం ఉద్యమించాలని వివిధ సంఘాల నేతలు పిలుపునిచ్చారు. షహీద్ భగత్ సింగ్ రాజ్ గురు సుఖ్ దేవుల 95 వ అమరత్వ దినం సందర్భంగా సోమవారం మంచిర్యాలలో ఏర్పాటుచేసిన సంస్మరణ సభలో వారు పాల్గొని ప్రసంగించారు. కుల మత సంకుచిత ధోరణులను అధిగమించిన నాటి వీరులు స్వాతంత్ర్య పోరాటంలో ఐక్యంగా పాల్గొన్నారని వారు తెలిపారు. నేటి కాలంలో ప్రజలు మత సామరస్యతను, జాతి సమైక్యతనుకాపాడాలని పిలుపునిచ్చారు. "సామ్రాజ్యవాద్ ముర్దాబాద్" అంటూ నేటికీ వందేళ్ల క్రితమే షహీద్ భగత్ సింగ్ నినదించాడని వారు తెలిపారు. ఆయా స్వతంత్ర దేశాలలోకి చొరబడి దేశాధినేతలను రాక్షసంగా హతమార్చే జులుంను ప్రదర్శిస్తున్న అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడే వారికి భగత్ సింగ్ స్ఫూర్తిగా నిలిచాడని వారు పేర్కొన్నారు. దేశంలోని సామాన్య ప్రజలకు ఆకలి, పీడనల నుండి విముక్తి లభించడమే నిజమైన స్వాతంత్ర్యమని షహీద్ భగత్ సింగ్ పేర్కొన్నాడని వారు తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న అసలు సమస్యలపై పోరాడే వారికి తరగని స్ఫూర్తి ప్రదాతగా షహీద్ భగత్ సింగ్ నిలిచి ఉంటాడని తెలిపారు. భగత్ సింగ్ పుట్టిన గడ్డపై ఆయన ఆశయాలకు మరణం లేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో షహీద్ భగత్ సింగ్ స్మారక సమితి కన్వీనర్ అలుగూరి కైలాసం, సామాజిక న్యాయవేదిక కన్వీనర్ రంగు రాజేశం, బీసీ ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు కనుకుంట్ల మల్లయ్య, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం నాయకులు సంకె రవి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రంజిత్ కుమార్, బీమా ఉద్యోగుల సంఘం నాయకులు మోతే రామదాసు, ఏ తిరుపతిరెడ్డి, క్యాతం రవి, నేదునూరు కిరణ్, తూముల మల్లేష్, అన్నం రమేష్ కట్టా ప్రకాష్, కుక్కుడపు బాపు, గుమాస ప్రకాష్, వేముల అశోక్, తోట గౌరయ్య, ప్రేమ్ కుమార్, రవూఫ్ మిడివెల్లి రాజ్ కుమార్ పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: