ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ప్రతి విద్యార్థి వ్యాపారంలో మెలికలు తెలుసుకోవాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మహాత్మా సంతోష్ తెలిపారు. సోమవారం మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం వాణిజ్యశాస్త్రం విభాగం ఆధ్వర్యంలో ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు క్విజ్, పోస్టర్ ప్రజంటేషన్, పోటీలు నిర్వహించారు. విద్యార్ధులచే ఎంటర్ ప్ప్రెన్యూర్ విధానం కింద వ్యాపార మెళకువలను పెంచడం కోసం ప్రత్యేక వ్యాపార స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఇందులో మక్కగారెలు, డబల్ కమిట, పేపర్ డిజైనింగ్ ఫొటో ప్రేమ్ మొదలైన వ్యాపార స్టాళ్లు ఆకట్టుకున్నాయి. వినియోగ దారుల హక్కులపై ప్రత్యేక అవగాహనా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డా. మహాత్మా సంతోష్ అధ్యక్షత వహించి ప్రసంగించారు. విద్యార్థులంతా వినియోగ దారుల హక్కులపై అవగాహనా కలిగి ఉండాలని సరైన ఉత్పత్తిని సరైన ధరకు కొనడం ప్రజల హక్కు అని పేర్కొన్నారు. భవిష్యత్ లో వ్యాపారరంగం మరింతగా విస్తరిస్తుందని యువత అందులో మంచి అవకాశాలను అంది పుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డా. సంతోష్ కుమార్, అధ్యాపకులు జాడి శంకరయ్య , తన్నీరు సురేష్, లైబ్రేరియన్ నాగేశ్వర్ కవిత, మల్లయ్య, చంద్రశేఖర్ , శ్రీనివాస్, సంధ్యారాణి, సత్యనారాయణ, కాంతయ్య, నివేదిత, స్వామి విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.
Admin
E Nivas News