Friday, 31 July 2026 01:34:45 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

ప్రజల హక్కులను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వం...! ప్రజా వ్యతిరేక విధానాలను తీపి కొట్టాలి

వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అలవాల వీరయ్య

Date : 18 January 2026 07:32 PM Views : 227

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / మరిపెడ, ఉప్పుల రమేష్ : గత 11 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రచార వ్యతిరేక విధానాల మూలంగా ప్రజల హక్కులు కాలరాయపడుతున్నాయని, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మహబూబాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి అలవాల వీరయ్య అన్నారు. సిఐటియు, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో లేబర్ కోడ్స్, విబి రాంజీ చట్టం, జాతీయ విత్తన, నూతన విద్యుత్తు బిల్లు సవరణ రద్దుకై జిల్లా జీబు జాత మరిపెడ మండలంలోని గుండెపూడి , మరిపెడ(బంగ్లా), అబ్బాయి పాలెం గ్రామాలలో పర్యటించింది,ఈ సందర్భంగా జరిగిన సభలో వీరయ్య మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఒక వైపు ప్రజా సంక్షేమం వల్లిస్తూనే 11 సంవత్సరాల పాలనలో బడా కార్పొరేట్ సంస్థలకు రూ: 16 లక్షల కోట్ల రూపాయలు రాయితీ ఇచ్చిందని చివరికి ప్రభుత్వ రంగ సంస్థలను కూడా ఆదాని అంబానీ వంటి బడా పెట్టుబడిదారులకు కట్టబెట్టడం సిగ్గుచేటు అన్నారు. అత్యంత ప్రమాదకరమైన 4 లేబర్ కోడ్ లను అమలు చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేగాక విద్యుత్ సవరణ చట్టం, విత్తన బిల్లు, వి బి జి రాంజీ చట్టం నల్ల చట్టాలను తీసుకొచ్చిందన్నారు. గత 40 సంవత్సరాలుగా పోరాడు సాధించుకున్న చట్టాలను, మూడు గంటల్లోనే కేంద్ర ప్రభుత్వం తునాతునకలు చేసి విజయం సాధించినట్టు గొప్పలు చెప్పుకోవటం అత్యంత దుర్మార్గమైన చర్య అన్నారు. భారత ప్రజాస్వామ్యానికే మచ్చ తెచ్చేలాంటి చట్టాలు అమలు చేస్తుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరని వారికి అండగా వామపక్ష పార్టీలు ప్రజా సంఘాలు ఉన్నాయన్నారు .పెట్టుబడుదారుల మోచేయి నీళ్లు తాగుతున్న నరేంద్ర మోడీ ప్రభుత్వాలపై ప్రజలు తిరగబడాలని పిలుపునిచ్చారు.భీమా రంగంలోకి 100% విదేశీ పెట్టుబడులకు అనుమతి అనురంగంలోకి ప్రవేట్ కంపెనీలకు విచ్చలవిడిగా అనుమతినిస్తూ అనుచట్టం చేసిందని ఆరోపించారు. వీటికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమాన్ని నిర్వహించాలని సంకల్పంతో కార్మిక ట్రేడ్ యూనియన్,రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘంల ఆధ్వర్యంలో జనవరి 7 నుండి దేశవ్యాప్తంగా అన్ని గ్రామాలలో నిరసన ఆందోళన నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. 8 నుండి 18వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలు గ్రామాలను కలుస్తూ జీబు జాతాను నిర్వహిస్తు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు.ఈ నేపథ్యంలో నేడు జిల్లా కేంద్రంలో జరిగే భారీ ప్రదర్శన, బహిరంగ సభను విజయవంతం చేయాలని వీరయ్య కోరారు. ఈ సభలలో రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గునిగంటి రాజన్న, నల్లపు సుధాకర్, సిఐటియు జిల్లా కార్యదర్శి సమ్మెట రాజమౌళి, అబ్బాయిపాలెం సిపిఎం వార్డు సభ్యురాలు నందిపాటి ఉప్పలమ్మ,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు బాణాల రాజన్న,రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కందాల రమేష్, కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) జిల్లా ఉపాధ్యక్షులు జిన్న లచ్చయ్య, భవన నిర్మాణ కార్మిక సంఘం (సిఐటియు) జిల్లా నాయకులు కొండ ఉప్పలయ్య,వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి గుండగాని మధుసూదన్,కల్లుగీత కార్మిక సంఘం జిల్లా నాయకులు బోడపట్ల రాజశేఖర్,ప్రజా సంఘాల నాయకులు నందిపాటి వెంకన్న, తాటికొండ అనంతచారి, జినక సైదులు,జామ్మూర్తి, ఆల్లి శ్రీనివాస్ రెడ్డి,బయ్య సురేష్,నరేష్,ఎర్ర ఎంకన్న, జినక రామ్మూర్తి, తదితరులు ఉన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :