ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : పి ఆర్ టి యు మంథని మండల అధ్యక్షులుగా ఎగ్గడి సురేష్, ప్రధాన కార్యదర్శిగా పచ్చిక స్వరూప ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు టి స్ పి ఆర్ టి యు జిల్లా అధ్యక్షులు గండు కృష్ణమూర్తి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వీరి నియామకం తక్షణమే అమలులోకి వస్తుందని, వీరి నియామకం పట్ల మండల సభ్యులు హర్షం వ్యక్తం చేసారు. తమను అధ్యక్ష కార్యదర్శులుగా నియమించిన జిల్లా శాఖ అధ్యక్షులు గండు కృష్ణ మూర్తి, ప్రధాన కార్యదర్శి కానుగంటి శ్రీనివాస్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పి ఆర్ టి యు సంఘ నియమా నిబంధనలను గౌరవిస్తూ జిల్లా శాఖ ఆదేశించిన కార్యక్రమాలకు పూర్తి స్థాయిలో సహకరిస్తామని నూతన అధ్యక్ష కార్యదర్శులు తెలిపారు.
Admin
E Nivas News