Thursday, 30 July 2026 02:28:14 PM
# మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం

జిల్లాలో పటిష్టంగా రోడ్డు భద్రత నిబంధనలు అమలు

జిల్లా రవాణా అధికారి సిహెచ్.రంజిత్

Date : 23 December 2025 09:01 PM Views : 163

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : జిల్లాలో రోడ్డు భద్రతా నిబంధనలను పటిష్టంగా అమలు చేయడం జరుగుతుందని జిల్లా రవాణా అధికారి సిహెచ్.రంజిత్ మంగళవారంఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వాహనదారులకు సరైన ధ్రువపత్రాలు లేకున్నా, నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నడిపిన, మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. 2025-2026 ఆర్థిక సంవత్సరంలో ఈ కార్యాలయానికి నిర్దేశించిన 69.63 కోట్ల రూపాయల ఆదాయ లక్ష్యానికి గాను ఇప్పటి వరకు 55.48 కోట్ల రూపాయలు సాధించడం జరిగిందని తెలిపారు. జిల్లాలో 48 ఓవర్‌ లోడింగ్ కేసులు నమోదు చేయడం జరిగిందని, 77 డ్రైవింగ్ లైసెన్స్‌లు సస్పెండ్ చేయడం జరిగిందని, వసూలు చేయబడిన పన్ను,జరిమానాతో కలిపి మొత్తం 27.92 కోట్ల రూపాయలు కాంపౌండింగ్ రుసుము వసూలు చేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర రవాణా శాఖ ఉత్తర్వుల ప్రకారం ఒకే వాహనం ఒక సంవత్సరం లోపు 2వ సారి,అంతకంటే ఎక్కు వసార్లు ఓవర్‌లోడ్ చేయబడినట్లు గుర్తించినట్లయితే, కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, రిజిస్ట్రేషన్ అథారిటీ చట్టం ప్రకారం 6 నెలల పాటు వాహనం అనుమతిని సస్పెండ్ చేయడం జరుగుతుందని తెలిపారు. సస్పెన్షన్ సమయంలో ఏదైనా సస్పెండ్ చేయబడిన వాహనం తిరుగుతున్నట్లు గుర్తించినట్లయితే, వాహనాన్ని స్వాధీనం చేయడం జరుగుతుందని, వాహన యజమానులు, డ్రైవర్లు మోటారు వాహన0 నియమాలను ఖచ్చితంగా పాటించాలని, ఓవర్‌లోడింగ్‌ను నివారించాలని, సురక్షితమైన ప్రయాణానికి, రవాణాకు సహకరించాలని తెలిపారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :