Thursday, 30 July 2026 10:38:04 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

తెలంగాణ రాష్ట్రంలో ఘనంగా వసంత పంచమి వేడుకలు..

Date : 23 January 2026 06:58 PM Views : 302

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ బాసర జ్ఞాన సరస్వతి దేవాలయం తో పాటు ఇతర దేవాలయాల్లో శుక్రవారం వసంత పంచమి మరియు శ్రీ పంచమి వేడుకలను శాస్త్ర యుక్తంగా వేద పండితులు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవార్ల విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి చిన్నారులకు అక్షరాభ్యాసాలు చేయించారు. సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఘనంగా జరుపుకున్నారు. 20 సంవత్సరాలకు ఒకసారి వచ్చి వసంత పంచమి శుక్రవారం వస్తుందని పెద్దలు తెలిపారు. అనంతరం వందలాది మంది చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహించారు. సరస్వతీ హోమం చేసిన తర్వాత చిన్నారులకుఅక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహించారు. మాఘ మాస శుక్ల పక్ష పంచమి తిథిన జరుపుకునే వసంత పంచమి రోజున ప్రకృతి అంతా నూతన ఉత్సాహంతో కళకళలాడుతుంది. ఇదే రోజు సరస్వతి దేవి అవతరించిందని పురాణాలు పేర్కొంటున్నాయి. అందుకే ఈ పర్వదినాన్ని విద్యారంభానికి శ్రేష్ఠమైన దినంగా భావిస్తారు. సర్వస్వతీ అమ్మవారి ఆలయాల్లోనే కాకుండా నివాసాలు, విద్యాలయాల్లోనూ చదువుల తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

వసంత పంచమి రోజున చేసే కార్యాలకు పంచాంగ దోషాలు ఉండవని శాస్త్రాలు చెబుతున్నాయి. పిల్లలు చదువులో రాణించేందుకు నేడు అక్షరాభ్యాసం చేయిస్తారు. సంగీత, కళా శిక్షణ ప్రారంభం చేయడం వల్ల చిన్నారులకు జ్ఞానం, బుద్ధి, వాక్చాతుర్యం లభిస్తాయని నమ్మకం. చాలా విద్యాలయాల్లో సరస్వతీ పూజలు చేయడంతోపాటు తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించి చిన్నారులకు పెన్నులు, పలకలు, పుస్తకాలు పంచిపెడతారు. ఈ రోజు ఈ విధంగా చేస్తే అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని నమ్మకం. పిల్లలకు చిన్నతనం నుండి మన సంస్కృతి సాంప్రదాయాలు నేర్పించడం వల్ల పిల్లలు మంచి పౌరులుగా తయారవుతారని ఉద్దేశంతో జరిపినట్లు పలువురు తెలిపారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :