ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ బాసర జ్ఞాన సరస్వతి దేవాలయం తో పాటు ఇతర దేవాలయాల్లో శుక్రవారం వసంత పంచమి మరియు శ్రీ పంచమి వేడుకలను శాస్త్ర యుక్తంగా వేద పండితులు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవార్ల విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి చిన్నారులకు అక్షరాభ్యాసాలు చేయించారు. సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఘనంగా జరుపుకున్నారు. 20 సంవత్సరాలకు ఒకసారి వచ్చి వసంత పంచమి శుక్రవారం వస్తుందని పెద్దలు తెలిపారు. అనంతరం వందలాది మంది చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహించారు. సరస్వతీ హోమం చేసిన తర్వాత చిన్నారులకుఅక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహించారు. మాఘ మాస శుక్ల పక్ష పంచమి తిథిన జరుపుకునే వసంత పంచమి రోజున ప్రకృతి అంతా నూతన ఉత్సాహంతో కళకళలాడుతుంది. ఇదే రోజు సరస్వతి దేవి అవతరించిందని పురాణాలు పేర్కొంటున్నాయి. అందుకే ఈ పర్వదినాన్ని విద్యారంభానికి శ్రేష్ఠమైన దినంగా భావిస్తారు. సర్వస్వతీ అమ్మవారి ఆలయాల్లోనే కాకుండా నివాసాలు, విద్యాలయాల్లోనూ చదువుల తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
వసంత పంచమి రోజున చేసే కార్యాలకు పంచాంగ దోషాలు ఉండవని శాస్త్రాలు చెబుతున్నాయి. పిల్లలు చదువులో రాణించేందుకు నేడు అక్షరాభ్యాసం చేయిస్తారు. సంగీత, కళా శిక్షణ ప్రారంభం చేయడం వల్ల చిన్నారులకు జ్ఞానం, బుద్ధి, వాక్చాతుర్యం లభిస్తాయని నమ్మకం. చాలా విద్యాలయాల్లో సరస్వతీ పూజలు చేయడంతోపాటు తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించి చిన్నారులకు పెన్నులు, పలకలు, పుస్తకాలు పంచిపెడతారు. ఈ రోజు ఈ విధంగా చేస్తే అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని నమ్మకం. పిల్లలకు చిన్నతనం నుండి మన సంస్కృతి సాంప్రదాయాలు నేర్పించడం వల్ల పిల్లలు మంచి పౌరులుగా తయారవుతారని ఉద్దేశంతో జరిపినట్లు పలువురు తెలిపారు.
Admin
E Nivas News