ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని జిల్లా ఎస్పీ నితికాపంత్ గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ కార్యాలయంలో మాట్లాడుతూ లెక్కింపు కేంద్రాల వద్ద శాంతిభద్రతలు కాపాడేందుకు మరియు ఎలాంటి అసాంఘిక చర్యలు చోటుచేసుకోకుండా చూసేందుకు పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు, కౌంటింగ్ కేంద్రాల వెలుపల 163 బి.ఎన్.ఎస్.ఎస్ అమలులో ఉంటుందని తెలిపారు. లెక్కింపు కేంద్రాల పరిసరాల్లో భద్రత కోసం ప్రత్యేక బందోబస్తు, క్యూ.ఆర్.టి టీంలు, డాగ్ స్క్వాడ్ టీమ్స్, బాంబు డిస్పోసల్ టీమ్స్,స్ట్రైకింగ్ ఫోర్సులు సిద్ధంగా ఉంచనునట్లు చెప్పారు. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఎస్పీ ప్రజలకు, అభ్యర్థులకు, గెలిచిన వారిని ఉద్దేశించి ముఖ్య సూచనలు జారీ చేశారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి తప్పనిసరిగా పాటించాలి.ఫలితాల అనంతరం విజయోత్సవ ర్యాలీలు, బైక్ ర్యాలీలు, డీజేలు, టపాకాయలు కాల్చటం, ఊరేగింపులకు ఎలాంటి అనుమతి లేదుశాంతి భద్రతలకు భంగం కలిగించే చర్యలు పూర్తిగా నిషేధించామన్నారు.జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిందని, గొడవలు అల్లర్లు సృష్టించే వారిని, నిబంధనలకువిరుద్ధంగా విజయోత్సవ ర్యాలీలు నిర్వహించే వారిపై రిమాండ్ లోకి తీసుకోవలసి ఉంటుందని తెలిపారు. ర్యాలీలు లేదా ఊరేగింపులు నిర్వహించుట కొరకు సంబంధిత అధికారుల ఉత్తర్వుల మేరకు వారు నిర్దేశించిన తేదీల్లో మాత్రమే జరుపుకోవాలి. ఎవరైనా నియమావళిని ఉల్లంఘిస్తే, లేదా శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తిస్తే, వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే, ప్రజలందరూ శాంతి, సామరస్య వాతావరణాన్ని కాపాడాలని, ఫలితాలను పరస్పర గౌరవంతో స్వీకరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.
Admin
E Nivas News