ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : రోడ్డు ప్రమాదాల సంఖ్యను గణనీయంగా తగ్గించడానికి నూతన విధానం."అరైవ్ అలైవ్" లో భాగంగా గత నెల 21న రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా జరిగిన ఉచిత కంటి పరీక్షల్లో భాగంగా పరీక్షలలో కంటి సమస్యలు ఉన్న వాహన డ్రైవర్లకు మంగళవారం పోలీసు కార్యాలయం లో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ 84 వాహన డ్రైవర్లకు ఉచితంగా కంటిఅద్దాలను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ముఖ్యంగా ఆటో డ్రైవర్లు వాహన నియమనిబంధనలు పాటించాలని, ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలిపారు. మంచి కంటి చూపు ప్రమాదాల నివారణకు దోహదపడుతుందని, జిల్లా పోలీసు శాఖ తరపున మరియు పట్టణంలోని ప్రైవేటు కార్తీక్ ఆప్టికల్స్ యజమాని పొలసాని హనుమాన్లు యాదవ్ సహకారంతో ఉచితంగా కంటి అద్దాలను డ్రైవర్లకు అందజేయడం జరిగింది. ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయవద్దని, ప్రయాణికుల ప్రాణాలు మీ చేతిలో ఉంటాయని వాటిని దృష్టిలో పెట్టుకొని, ప్రమాదాల నివారణకు జిల్లా పోలీసుల సూచనలు పాటిస్తూ ప్రాణానష్టాన్ని తగ్గించాలనిసూచించారు. వాహనాలు, ఆటోలు, టాక్సీలు రాంగ్ సైడ్ ప్రయాణించడం వల్ల ప్రమాదాలకు గురి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని రాంగ్ సైడ్ ప్రయాణాన్ని మానుకోవాలని సూచించారు. ముఖ్యంగా జాతీయ రహదారులపై సైన్ బోర్డులు, వేగ నియంత్రణ బోర్డులు ఉన్న సందర్భంలో వాహన వేగాన్ని తగ్గించాలని, అతివేగం ప్రమాదాలకు కారణమవుతుందని తెలిపారు. పట్టణంలోని ఆటోలు అధిక సంఖ్యలో ప్రయాణికులను ఎక్కించుకున్న సందర్భంలో వారి పై చర్యలు తీసుకోబడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి, పట్టణ సిఐలు బి సునీల్ కుమార్, కె నాగరాజు, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు పెంచల వెంకటేశ్వర్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News