ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : తెలంగాణరాష్ట్రంలోవేలాదికుటుంబాలకు ఆధారమైన చేనేత పరిశ్రమ ప్రస్తుతం తీవ్ర సం క్షోభాన్ని ఎదుర్కొంటోందని పద్మశాలి సంఘం జిల్లా అ ధ్యక్షులు క్యాతం సతీష్ కుమార్ తెలిపారు.ఈసంద ర్భంగా భూపాలపల్లి ఎమ్మె ల్యే గండ్ర సత్య నారాయ ణ రావును కలిసి సమస్యలపై వినతి పత్రం సమర్పించా రు.ప్రస్తుతం టెస్కోఅమలు చేస్తున్న టెండర్ విధానం కారణంగా ధరల పోటీ పెరి గి,మధ్యవర్తులు తక్కువ ధ రలకుపనులుదక్కించుకుంటున్నారని పేర్కొన్నారు.దీ నివల్ల చేనేత కార్మికులకు తగిన కూలి అందక వారి జీవనోపాధిదెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా,ఈ విధానం వల్ల చిన్న చేనేత సహకార సంఘాలు పోటీలో నిలవ లేకఆర్థికంగాబలహీనపడుతున్నాయని,యువత ఈ వృత్తినుంచిదూరమవుతున్నారని తెలిపారు.ఇది కొన సాగితే సంప్రదాయ చేనేత వృత్తికనుమరుగయ్యే ప్రమా దం ఉందని హెచ్చరించారు. కాబట్టి,చేనేత కార్మికులకు న్యాయమైన పారితోషికం కల్పించేలా,సహకార సం ఘాలకు ప్రాధాన్యత ఇచ్చే లా ప్రభుత్వం చర్యలు తీసు కోవాలనికోరారు.ముఖ్యంగా టెస్కో టెండర్ విధానాన్ని తక్షణమే పునఃపరిశీలించాలని విజ్ఞప్తిచేశారు. ఈసమస్యపై ముఖ్యమంత్రి రేవంత్ రె డ్డితో చర్చించి చేనేత కార్మి కులకు న్యాయం జరిగేలాచ ర్యలు తీసుకోవాలని ఎమ్మె ల్యేను అభ్యర్థించారు.ఈకార్యక్రమంలో చేనేత సంఘం జిల్లా అధ్యక్షులు మాచర్ల మ హేందర్,పద్మశాలి సంఘం నాయకులు భాగవతం బిక్ష పతి,రాజేష్,రవీందర్,పల్ల వేని సంపత్,పెంట రంజిత్ కుమార్,పెంట వేణు,రాజేం దర్.తోపాటు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News