ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : జిల్లా కాటారం మండలం ఇబ్రహీంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని చింతకాని క్రాస్ గణేష్ నగర్ కాలనీలో తను నిర్మించుకున్న రేకుల షెడ్డును ఈనెల 4 న రాత్రి 11గంటలకు ఇంట్లో ఎవరు లేని సమయంలో లోవంగల సుదర్శన్, మహాదేవపూర్ గ్రామానికి చెందిన ఓదెల సదయ్య, మరికొందరు కలిసి జెసిబి తో రేకుల షెడ్డును కూల్చి వేసినట్లు పోట్ల పోచమ్మ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కాటారం పోలీస్ స్టేషన్ లో ఈ నెల 5న ఫిర్యాదు చేసినా తమను పట్టించుకోవడంలేదని ఆవేదన తో జిల్లా ఎస్పీకి సోమవారం ఫిర్యాదు చేశామని ఆమె తెలిపారు. పోతుల వాయి. శివారులోని సర్వే నెంబర్ 254/2 లో 22 గుంటల ప్రభుత్వ భూమి 2006 సంవత్సరంలో ప్రభుత్వం కేటాయించడం జరిగిందని, ఈ భూమిని సాగు చేసుకుంటూ జీవనోపాధి గడు పుతున్నమని, భూమిలో నుండి వెల్లిపోవాలని బెదిరిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. వారి నుండి నాకు కుటుంబానికి ప్రాణభయం ఉందని, ప్రభుత్వ భూమి నా పేరు పైనే ఉన్నదని ఆమె పేర్కొన్నారు. మమ్ములను భయ భ్రాంతులకు గురి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని నా కుటుంబానికి నాకు జరిగిన నష్టానికి న్యాయం చేయాలని ఫిర్యాదు లో పేర్కొన్నట్లు ఆమె తెలిపారు.
Admin
E Nivas News