Friday, 19 June 2026 01:36:07 PM
# 26 నఖరీఫ్ సీజన్ కు రైతు భరోసా అందించనున్న ప్రభుత్వం... # చికిత్స పొందుతూ యువకుడు మృతి # ఎల్.పి.జి.వినియోగదారులు బ్యాంకు ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలి... # రుద్రంగి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గల్ఫ్ కార్మికుడు మృతి... # కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన సిర్పూర్ ఎమ్మెల్యే.. # నకిలీ, నాణ్యతలేని విత్తనాలపై ఉక్కుపాదం...! 220 దుకాణాల తనిఖీ.. 18 మందిపై 7 కేసులు 10.20 లక్షల విలువైన 1,181 పత్తి విత్తన ప్యాకెట్లు స్వాధీనం.. # పాఠశాల అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి.. # సేవా కార్యక్రమాలకు గౌరవ డాక్టరేట్ పురస్కారం అందుకున్న మడే రాజేష్ # జన్యుపరమైన అనారోగ్యంతో పోరాడుతున్న హనుమకొండకు చెందిన నిరంజన్..!అభిమాని నిరంజన్ ను పరామర్శించినపవన్ కళ్యాణ్... # ఆదివాసి మహిళలను చెప్పులతో కొట్టిన ఫారెస్ట్ అధికారులును వెంటనే సస్పెండ్ చేయాలి... # జిల్లాలో వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి.. # రైతు వేదికల్లో విత్తనాలు, ఎరువుల పంపిణీ .. ! కేంద్రం పైన ఎప్పటికప్పుడు ఒత్తిడి.. # మంచిర్యాలలో ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులపై ఆర్టీఏ కొరడా.. 5 బస్సులు సీజ్ # వృద్ధాప్యంలో కొండంత అండ: రూ. 30 లక్షల ప్రమాద బీమా, రూ. 10 లక్షల సహజ మరణ బీమా కల్పించడం పట్ల సర్వత్రా హర్షం... # తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలికి ఘన స్వాగతం.. # ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని 100 శాతం విజయవంతం చేయాలి.. # ఎమ్మెల్యే పై కవిత అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.. # అంగన్‌వాడీలే చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాదులు. మంత్రి సీతక్క.. # రైతులకు విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.. # ఇందిరమ్మ ఇళ్లకు 77 లక్షల దరఖాస్తులు.. స్థలం లేనివారికీ మంజూరు..

ఎల్పీజీ కొరతపై రాష్ట్ర ప్రభుత్వ యాక్షన్ ప్లాన్‌ను కచ్చితంగా అమలు చేయాలి...

మంత్రి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో వీడియో కాన్ఫరెన్స్

Date : 14 March 2026 06:58 AM Views : 151

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : రాష్ట్రంలో ఏర్పడిన ఎల్పీజీ గ్యాస్ కొరత నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి , తుమ్మలనాగేశ్వరరావు ,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ( సీ.యస్ ) రామకృష్ణ రావు ఆధ్వర్యంలో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల జిల్లా ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎల్పీజీ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని, గ్యాస్ సిలిండర్ల అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్, అధిక ధరలకు విక్రయించడం వంటి చర్యలను కట్టడి చేయాలని అధికారులకు సూచించారు.అలాగే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గ్యాస్ సరఫరా సక్రమంగా జరిగేలా సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకొని పని చేయాలని, ఎల్పీజీ కొరత నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన యాక్షన్ ప్లాన్‌ను కచ్చితంగా అమలు చేయాలని తెలియ జేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల, ఐపీఎస్ మాట్లాడుతూజిల్లా పరిధిలో ఎల్పీజీ పంపిణీ వ్యవస్థపై ప్రత్యేక నిఘా ఉంచాలని, గ్యాస్ సిలిండర్ల అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్ వంటి చర్యలను కట్టడి చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. ఎవరైనా అక్రమంగా ఎల్పీజీ సిలిండర్లను నిల్వ ఉంచడం లేదా అధిక ధరలకు విక్రయించడం వంటి కార్యకలాపాలు నిర్వహిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా పోలీసు అధికారులను ఆదేశించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: