ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మీసేవ నిర్వాహకుడి హత్య కేసును పోలీసులు 24 గంటల్లో చేదించి నిందితులు ఐదుగురని పట్టుకున్నారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరీ కాలనీ సమాఖ్య కార్యాలయంలో మీసేవ నిర్వాహకుడు కోట చిరంజీవి (35), న్యూ మారేడుపాక హత్య కేసులో పోలీసులు 24 గంటల్లోనే నిందితురాలు సంధ్యారాణి, ఆమె భర్త కుమార్, తండ్రి మల్లయ్య, అన్న నరేష్, బావమరిది చందులను పోలీసులు అరెస్టు చేశారు. గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ వెల్లడించిన వివరాల ప్రకారం మృతుడు చిరంజీవి సంధ్యారాణితో పరిచయం పెంచుకుని తరచూ కాల్స్ చేస్తూ వేధించేవాడు. భయంతో ఆమె దూరంగా ఉండగా, ఆమెను, ఆమె కుటుంబాన్ని చంపుతానని బెదిరించడంతో సంధ్యారాణి తన భర్తకు విషయం చెప్పిగా గ్రామంలో పంచాయతీ నిర్వహించారు. అయినప్పటికీ చిరంజీవి వేధింపులు ఆగలేదు. అక్టోబర్ 10న సంధ్యారాణి పనిచేస్తున్న కార్యాలయానికి వచ్చిన చిరంజీవి సంధ్యారాణితో వాగ్వాదించగా ఆమె తన కుటుంబ సభ్యులకు విషయాన్ని చేరవేయగా, వచ్చిన ఆమె కుటుంబ సభ్యులు చిరంజీవిపై దాడి చేశారు. తండ్రి మల్లయ్య ముందుగానే తెచ్చుకున్న ఇనుపరాడుతో చిరంజీవి తలపై బలంగా కొట్టగా , భర్త కుమార్, అన్న నరేష్, బావమరిది చందులు కలిసి చిరంజీవి పై దాడి చేయగా అక్కడికక్కడే మృతి చెందాడు. ఏసీపీ ఎం.రమేష్ ఆధ్వర్యంలో పోలీసులు నిందితులను పెంచికల్పేట్ ఎక్స్రోడ్ వద్ద పట్టుకొని, మూడు బైక్లతో పాటు హత్యకు ఉపయోగించిన ఇనుపరాడు, చాకును స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించారు.
Admin
E Nivas News