Wednesday, 17 June 2026 01:54:55 PM
# ఆదివాసి మహిళలను చెప్పులతో కొట్టిన ఫారెస్ట్ అధికారులును వెంటనే సస్పెండ్ చేయాలి... # జిల్లాలో వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి.. # రైతు వేదికల్లో విత్తనాలు, ఎరువుల పంపిణీ .. ! కేంద్రం పైన ఎప్పటికప్పుడు ఒత్తిడి.. # మంచిర్యాలలో ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులపై ఆర్టీఏ కొరడా.. 5 బస్సులు సీజ్ # వృద్ధాప్యంలో కొండంత అండ: రూ. 30 లక్షల ప్రమాద బీమా, రూ. 10 లక్షల సహజ మరణ బీమా కల్పించడం పట్ల సర్వత్రా హర్షం... # తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలికి ఘన స్వాగతం.. # ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని 100 శాతం విజయవంతం చేయాలి.. # ఎమ్మెల్యే పై కవిత అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.. # అంగన్‌వాడీలే చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాదులు. మంత్రి సీతక్క.. # రైతులకు విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.. # ఇందిరమ్మ ఇళ్లకు 77 లక్షల దరఖాస్తులు.. స్థలం లేనివారికీ మంజూరు.. # పేదింటి ప్రజల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ధ్యేయం # పేద ప్రజలకు న్యాయం చేసే వరకు పోరాడుతా # ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన కవిత # సింగరేణి సంస్థ సర్వతోముఖాభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దాం… # ఉప ముఖ్యమంత్రిబట్టి విక్రమార్క ను సన్మానించిన మాజీ ఎమ్మెల్యే... # మునీర్ భాయ్ పుస్తకావిష్కరణ లో పాల్గొన్న మంత్రి వివేక్ # అమావాస్య రోజు మోగనున్న బడిగంటలు.. # ప్రజల మధ్యలో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ # కార్మిక సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..! బిజెపి, బి ఆర్ ఎస్ కుట్రలను సాగనివ్వం...

ప్రజల సహకారంతోనే టీబీ రహిత సమాజం సాధ్యం...

వైద్యాధికారి సతీష్ కుమార్

Date : 13 March 2026 12:21 AM Views : 168

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ప్రజలందరి సహకారంతో త్వరలోనే టీబీ రహిత భారతదేశం దిశగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం వెంకట్రావుపేట వైద్యాధికారి డాక్టర్ సతీష్ కుమార్ అన్నారు .గురువారం లక్షెట్టిపేట మున్సిపల్ పరిధిలోని ఇటిక్యాల మూడో వార్డులో జరిగిన టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం లో ఆయన పాల్గొని ప్రజలకు క్షయ వ్యాధి పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్షెట్టిపేట మండలం లోని కొత్తూర్ గ్రామాన్ని ఇటీవల టీబీ రహిత గ్రామంగా ప్రకటించడం జరిగిందని తెలిపారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్ లో భాగంగా రెండవ విడత కార్యక్రమంలో అనుమానితులందరికీ ప్రజల వద్దకే వెళ్లి పోర్టబుల్ మోబైల్ ఎక్స్ రే ద్వారా ఎక్స్ రే పరీక్షలు నిర్వహించి టీబీ నిర్ధారణ చేసినట్లు తెలిపారు. 60 సంవత్సరాలు పైబడిన వారు , బిపి , షుగర్ వున్నవారు , గుట్కా, అంబార్ తోపాటు బీడీ , సిగరెట్, మద్యం సేవించేవారు మరియు గతంలో క్షయ వ్యాధి సోకినవారి కుటుంబ సభ్యులు తప్పని సరిగా ఈ వైద్య శిభిరాలలో పరీక్షలు నిర్వహించుకుని వ్యాధి నిర్ధారించుకుని ప్రభుత్వానికి సహకరించాలని ఆయన కోరారు. మహాలక్ష్మి వాడ లో మరియు ఈ రోజు ఇటిక్యాల వార్డులో రేపు ఊత్కూర్ ఏరియా లో క్యాంపులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ క్యాంపు లను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ సతీష్ కుమార్ కోరారు. గురువారం ఇటిక్యాల లో 90 మందికి ఎక్స్ రే పరీక్షలు 20 మందికి తెమడ పరీక్షలు,100 మందికి షుగర్, బీపి తోపాటు సాధారణ పరీక్షలు నిర్వహించి వారికి మందులను అందజేసినట్లు డాక్టర్ సతీష్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీబీ సూపర్ వైజర్ సురేష్ ,ఎంఎల్ హెచ్ పి అంజలి , హెల్త్ అసిస్టెంట్లు గఫూర్, ఇసాక్ అహ్మద్, ఏఎన్ఎం లు విజయదర్షిణి, చిలకమ్మ మరియు ఆశావర్కర్స్ హైమవతి, విజయ,పద్మ తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :