ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణ అభివృద్ధికి మరో ముఖ్యమైన అడుగు పడింది. పట్టణంలో రూ.2 కోట్ల 31 లక్షల వ్యయంతో చేపట్టనున్న మినీ ట్యాంక్ బండ్ సుందరీకరణ పనులకు రాష్ట్ర కార్మిక మరియు గనుల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి ఆదివారంభూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రిమాట్లాడుతూ పట్టణాలలో పర్యావరణ సౌందర్యాన్ని పెంపొందించడమే కాకుండా ప్రజలకు విశ్రాంతి, వినోదం కలిగించే ప్రదేశాలను అభివృద్ధి చేయడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. మినీ ట్యాంక్ బండ్ అభివృద్ధితో స్థానిక ప్రజలకు ఉదయం, సాయంత్రం వేళల్లో సేదతీరే సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలను మరింత విస్తరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
Admin
E Nivas News