ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : సమాజంలో ఎందరో విశిష్ట వ్యక్తులు ఉన్నారని నిర్మల్ పట్టణానికి చెందిన డాక్టర్ తుమ్మల దేవరావుతెలిపారు. మంగళవారం బ్రహ్మయ్య స్వగృహంలో కలిసి శాలువాతో సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అనంతరం ఆయన మాట్లాడుతూఏ రకమైన ప్రచారాలకి, ప్రసంశలకు అవకాశం ఇవ్వకుండా జీవిస్తారు. మనం అన్వేశించి పట్టుకోగలిగితే వారి జీవనం జీవనదిలా విస్తారంగా సాగతుందని తెలుసుంటాం. వారి నిరాడంబరత మనల్ని ఆశ్చర్యపరుస్తుంది.నేను కలిసిన విశిష్ట వ్యక్తుల్లో మంచిర్యాల జిల్లా ( లక్షెట్టిపేట )కు చెందిన కొండోజు బ్రహ్మయ్య ఒక్కరు. అప్పటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కోశాధికారి (డీ టి ఓ ) ఇరవై అయిదు సంవత్సరాల క్రితమే పదవీవిరమణ చేసి ప్రశాంత జీవితం గడుపుతున్నారు. ఆయన వయస్సు ప్రస్తుతం 86 సంవత్సరాలు గడుస్తున్న ఆరోగ్యంగా, నిర్భయలుగా జీవిస్తూ ఒక ఎకరం స్థలంలో అందమైన ఉద్యానవనాన్ని సృష్టించారు. వేలాది మొక్కల్ని సంరక్షిస్తూ, ఎన్నో పక్షుల కిలకిలరావాల మధ్య ఆశ్రమ వాసిగా జీవిస్తున్నారు. రాతినిర్మాణపద్దతిలో మట్టితో నిర్మించిన ఇంటిలో యోగసాధన, అధ్యాత్మిక చింతన, పుస్తకపఠనం, (హనుమాన్) ఆలయనిర్వాహణ చేస్తూ,జీవవైవిధ్యాన్ని అస్వాదిస్తూ ప్రశాంతంగా కనబడుతారు.వారిని పలుకరిస్తే ఎన్నో అనుభవాలు, ఎన్నో ఎన్నో విషయాలు నది ప్రవాహంలా వస్తాయి. అన్నింటికన్నా వారు నిర్మల్ జిల్లా వాస్తవ్యులు కావడం గమనార్హం. ఆయన మూలాలు, బంధుగణం కసుబ, సోనారిగల్లీలో ఉన్నారు. నిర్మల్ లోని అన్నీ ప్రాంతాలు, ఆలయాలు, కోటలు వారిస్మృతిలో సజీవంగా ఉన్నాయి. బంధు, మిత్రుల పట్ల అవ్యాజ ప్రేమ,పురిటిగడ్డ నిర్మల్ మీద మమకారం. ఎవ్వరికైనా స్వస్థలం మీద మమకారం ఉంటుంది.దాన్ని విడిచి ఉద్యోగ, ఇతర కారణాల వల్ల ఇతర ప్రాంతాల్లో స్థిరపడటం బాధాకరం.వారికి చరిత్ర మీద ఉన్న ప్రేమ, నిర్మల్ గురించి ఇంకా తెలుసుకోవాలి అన్న ఆసక్తిని ఇనుమిడింప జేయడానికి వారికి "నిర్మల్ జిల్లా సమగ్రపరవశించానన్నారు స్వరూపం "బహుకరించి, వారి జీవనవైదుశ్యానికి పరవశించానన్నారు. ఈ అపూర్వ కలయికకు పూర్తి సహకారం అందజేసినవారు వారి రెండవ కుమారుడు కొండోజు శ్రీనివాస్ తండ్రి పట్ల వారుచూపే శ్రద్ద, గౌరవం, ప్రేమ నన్ను కదిలించాయన్నారు.
Admin
E Nivas News