Friday, 31 July 2026 01:36:56 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

మహిళోద్ధరణకు కృషి చేసిన మహానీయుడు జ్యోతిరావు ఫూలే...

మంథనిలో ఘనంగా పూలే వర్ధంతి వేడుకలు

Date : 28 November 2025 05:34 PM Views : 313

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు కృషి చేసిన మహానీయుడు జ్యోతిరావు పూలే అని కాంగ్రెస్ నాయకులు అన్నారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయిలి ప్రసాద్ ఆధ్వర్యంలో శుక్రవారం మంథని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించినారు. ఈ సందర్భంగా మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ కుడుదుల వెంకన్న, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయిలి ప్రసాద్ మాట్లాడుతూ, దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులు పొందడానికి సత్య శోధక్ సమాజ్ ను ఏర్పాటు చేసి అన్ని మతాలు, కులాల ప్రజలను చేర్చుకొని సామాజిక సంస్కరణ ఉద్యమంలో పూలే ఒక ముఖ్యమైన వ్యక్తిగా పరిగణించబడ్డారని అన్నారు. జ్యోతిరావు పూలే, సావిత్రి భాయి పూలే భారతదేశంలో బాలికల కోసం పూణేలో 1848లో ఒక పాఠశాలను ప్రారంభించారన్నారు. అంతేగాకుండా విద్య యొక్క విశ్వీకరణను సమర్ధించిన మొదటి సంస్కర్త కూడా పూలే అని అన్నారు. జ్యోతిరావు పూలేకు చిన్నప్పటి నుంచి శివాజి అంటే అభిమానం ఎక్కువని శివాజి, జార్జ్ వాషింగ్టన్ జీవిత చరిత్రలు ప్రభావితం చేయడం వల్ల దేశభక్తి, నాయకత్వ గుణాలు అలవాటయ్యాయని అన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాదుల శ్రీకాంత్, కాంగ్రెస్ నాయకులు మంథని సత్యనారాయణ, ,పేరవేన లింగయ్య, ఊదరి శంకర్, ఆరేళ్లి కిరణ్ గౌడ్,చంద్రు రాజమల్లు, దొరగోర్ల శ్రీనివాస్, ఎరుకల ప్రవీణ్,కొత్త శ్రీనివాస్, మంథని శ్రీనివాస్, బాలాజీ, మబ్బు తిరుపతి, భూడి ద రంజిత్, ఎరుకల రమేష్ బాబు, ఫయీo, ఇల్లుటo రమేష్, పసుల ప్రసాద్, తాళ్ల సత్యనారాయణ, సవాయి గణేష్, తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :