ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : అన్న నన్ను దేవుడే పంపిండు మీతో కలిసి పని చేయమని నాకున్న అనుభవాన్ని అంతా రంగరించి తూచా తప్పకుండా పార్టీ అభివృద్ధికి పని చేస్తానని మాజీ మంత్రి జీవన్ రెడ్డి కేసిఆర్ కు తెలిపారు. ఎర్రవెల్లి నివాసానికి చేరుకున్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి కి వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు ఘనంగా స్వాగతం పలికారు. బిఆర్ఎస్ అధినేత కే.చంద్రశేఖర్ రావుతో ఎర్రవెల్లినివాసంలో,మాజీ మంత్రి టి.జీవన్ రెడ్డిశుక్రవారం మర్యాదపూర్వక భేటీ అయ్యారు. నివాసానికి చురుకున్న జీవన్ రెడ్డికి పుష్పగుచ్ఛాలందించి బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా మాజీ మంత్రులు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్ రమణ, ఎమ్మెల్యే డా. కె.సంజయ్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే కె. విద్యాసాగర్ రావు, పార్టీ నేతలు గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి,రాగిడి లక్ష్మారెడ్డి తదితరులున్నారు. జీవన్ రెడ్డితోపాటు వచ్చిన వారిలో, వారి కుమారులు, జగిత్యాల మాజీ జడ్పీ చైర్ పర్సన్ వసంత సురేశ్ దంపతులు తదితరులున్నారు. అన్నా.నన్ను మీతో కలిసి పనిచేయమని దేవుడే పంపిండు అని సంతోషంగా చెప్పాడు. కేసీఆర్ తో భేటీ సందర్భంగా జీవన్ రెడ్డి భావోద్వేగం... నిరంతరం తన నియోజకవర్గం, జిల్లా ప్రజలు, రైతుల గురించి ఆలోచన చేసే రైతు నాయకుడు, తెలంగాణ తనానినికి దర్పణంగా నిలిచే మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి తెలంగాణ సాధకుడు రైతు బాంధవుడు బిఆర్ఎస్ అధినేత కెసీఆర్ కలయిక సందర్భంగా భావోద్వేగ వాతావరణం నెలకొంది. కేసీఆర్ ను కలిసిన సందర్భంగా జీవన్ రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. తెలంగాణకు నష్టం జరుగుతున్న సమయంలో మీతో కలిసి పనిచేయాల్సిన అవసరమున్నదని, మీతో కలిసి పనిచేయమని దేవుడే నన్ను మీదగ్గరికి పంపించిండు అన్నా. చాలా గ్యాప్ తర్వాత ఇన్నాల్లకైనా మీతో కలిసిపనిచేసే అవకాశం రావడం సంతోషంగా వుంది అన్నా..’’ అంటూ తన మనసులో మాటను భావోద్వేగంతో మాజీ మంత్రి జీవన్ రెడ్డి వ్యక్తం చేశారు. కాగా జీవన్ రెడ్డిని అనునయిస్తూ, వారిని అప్యాయంగా దగ్గరికి తీసుకున్న కేసీఆర్ వారిని హృదయపూర్వకంగా ఆలింగనం చేసుకొని, శాలువాతో సన్మానించి పుష్పగుచ్ఛం ఇచ్చి ఆహ్వానించారు. కాసేపు ఇష్టాగోష్టి తర్వాత జీవన్ రెడ్డి బృందాన్ని కేసీఆర్ భోజనానికి ఆహ్వానించారు.
Admin
E Nivas News