ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆత్మకూరు మున్సిపాలిటీ 11వ వార్డు నందు వార్డు అధ్యక్షులు అమృల్లా ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మొక్కలు నాటే కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ, సింగిల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్, టిడిపి పట్టణ అధ్యక్షుడు వేణుగోపాల్, తదితర నాయకులతో, కార్యకర్తలతో కలిసి పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ లు మాట్లాడుతూ మనమందరము మొక్కల నాటాలి, వాటికి నీళ్లు పోసి పరిరక్షించాలన్నారు. మనం వాడే ప్లాస్టిక్, రసాయన పదార్థాల వలన పర్యావరణం కలుషితమై యావత్ ప్రపంచమే ప్రమాదంలో ఉందని కావున ప్రతి ఒక్కరూ చెట్లను పెంచి పర్యావరణాన్ని కాపాడే బాధ్యత తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఏఈ షాహిర్, శానిటరీ ఇన్స్పెక్టర్ జీవన్ కుమార్, తెలుగుదేశం పార్టీ నాయకులు మున్నా, నబి రసూల్, షఫీ అహ్మద్, సుబ్బరాయుడు, మహమ్మద్ సయ్యిద్, ఇర్ఫాన్, భాష, మాలిక్, రిటైర్డ్ టీచర్ అబ్దుల్ వహీద్, తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News