Thursday, 30 July 2026 04:51:34 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఎదురుపాడులో ఉల్లి సాగులో మెళకువలపై రైతులకు శిక్షణ

Date : 30 June 2026 11:21 PM Views : 57

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / కొత్తపల్లి : కొత్తపల్లి మండలంలోని, ఎదురుపాడు గ్రామంలో కర్నూలు డాట్ సెంటర్ ప్రిన్సిపాల్ సైంటిస్ట్ డాక్టర్ పి.సుజాతమ్మ మాట్లాడుతూ ఖరీఫ్ లో మేలు రకాలైన అగ్రిఫౌండ్ డార్క్ రెడ్, భీమా శుభ్ర, భీమా శ్వేత, భీమారెడ్, భీమా వికాస్ మొదలగు రకాలు వేసుకోవాలన్నారు. నారు పోసుకునే ముందర థైరం 3 గ్రాముల కేజీ విత్తనానికి చొప్పున విత్తన శుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలనీ, నారు 6-8 వారాల వయసులో నాటుకోవాలన్నారు. ముదిరిపోయిన నారుని నాటుకోవడం వల్ల గడ్డలు పగుళ్లు వస్తాయన్నారు. నారు మొక్కలు నాటుకునే ముందర మలథయాన్ 2జీ + సిఓసి 3జీ చొప్పున కలిపిన ద్రావణంలో ముంచి నాటుకోవాలన్నారు. తప్పనిసరిగా ఎత్తు మడులలోనే నాటుకోవాలి, డ్రిప్ అమర్చుకొని సాగు చేసుకోవాలన్నారు. ఎకరాకు 10 టన్నులు చొప్పున ఎఫ్ వై ఎం, 250 కేజీ వేప పిండి వేసుకోవాలి. ఉల్లి నాటుకునే ముందర దుక్కిలో ట్రైకోడెర్మా విరిడి తప్పక వాడాలన్నారు. ఉల్లి సాగులో ప్రతి మూడు పంటలకు ఒకసారి జెడ్ ఎన్ఎస్O4 25 కేజీలు ఎకరాకి చొప్పున వేసుకోవాలి. ఈ కార్యక్రమంలో హార్టికల్చర్ ఆఫీసర్ కె.చందన, రామలింగారెడ్డి, విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ విజయ్, సిప్లాన్ కంపెనీ ప్రతినిధి వినోద్, పతాంజలి కంపెనీ మేనేజర్ రమణారెడ్డి, కిషోర్, ప్రసాద్, మధు, రవి మరియు రైతులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :