Friday, 31 July 2026 06:15:50 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

ఎంపీయుపీ ఉర్దూ పాఠశాలలో ఘనంగా "మెగా పేరెంట్స్- టీచర్స్ మీటింగ్ (మెగా పీటీమ్ 4.0)

ముఖ్యఅతిథిగా పాల్గొన్న మండల కో ఆప్షన్ మెంబర్ సయ్యద్. ముర్తుజాఆలి

Date : 24 July 2026 10:32 PM Views : 47

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : మండల కేంద్రమైన పాములపాడులోని, (ఎంపీయుపి) మండల ప్రజా పరిషత్ అప్పర్ ప్రైమరీ ఉర్దూ పాఠశాల హెచ్ఎం- బద్రున్నిసా బేగం ఆధ్వర్యంలో పిల్లల బంగారు భవిష్యత్ కోసం- బడి వైపు ఒక అడుగు అనే నినాదంతో తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం (మెగా పీటీమ్ 4.0) అత్యంత ఘనంగా నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల కో ఆప్షన్ మెంబర్ సయ్యద్.ముర్తుజాఅలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మండల కో ఆప్షన్ మెంబర్ సయ్యద్.ముర్తుజాఅలీ, పాఠశాల హెచ్ఎం- బద్రునిసా బేగం, విద్యా కమిటీ చైర్మన్ సుభాన్ మౌలానా, ఉపాధ్యాయులు నిజాముద్దీన్, జరీనా, తదితరులు మాట్లాడుతూ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమైనదని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు అన్ని రకాల మౌలిక వసతులను కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సమన్వయంతో విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశం ముగిసిన అనంతరం మండల కో ఆప్షన్ మెంబర్ సయ్యద్.ముర్తుజాఅలీ పాఠశాల విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి, వారి చదువుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి కూర్చొని ఎంతో ఆత్మీయంగా మధ్యాహ్న భోజనం చేశారు. భోజనం నాణ్యతను స్వయంగా పరిశీలించి, వంట ఏ విధంగా ఉందో విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఆయన స్వయంగా తమతో కలిసి భోజనం చేయడంతో విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్ మొగిలిశ్వరమ్మ, ఎంపియుపి ఉర్దూ పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు మరియు పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :