ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల : నంద్యాలలో ఏపీ రజక వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ సావిత్రి మరియు డైరెక్టర్ల ఆధ్వర్యంలో నేడు జరిగే చలో రాయలసీమ 5వ రజక ఆకాంక్ష సభలో రాష్ట్రంలోని రజకులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని బిజెపి పార్టీ పాములపాడు మండల అధ్యక్షులు రాయపాటి మురళీమోహన్ తెలిపారు. ఈ సందర్భంగా రాయపాటి మురళీమోహన్ మాట్లాడుతూ చలో రాయలసీమ కార్యక్రమంలో భాగంగా 5వ రజక ఆకాంక్ష సభ నిర్వహించబోతున్నట్లు, ఈ సభకు ఆంధ్రప్రదేశ్ రజక వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్ పర్సన్ సి.సావిత్రి, రాష్ట్రంలోని డైరెక్టర్ లందరూ, రజక నాయకులందరూ హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ నామినేటెడ్ చైర్మన్, డైరెక్టర్లు, రజక కార్పొరేషన్ డైరెక్టర్లు, రజక విజ్ఞానవంతులు, మేధావులు, ఉద్యోగులు, వివిధ రజక సంఘాల నాయకులు హాజరవుతున్నట్లు తెలిపారు.
Admin
E Nivas News