Saturday, 13 June 2026 02:54:51 PM
# సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి # పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలి # ఎస్ఐఆర్ శిక్షణ తరగతులలో బూత్ లెవెల్ ఏజెంట్ లకు ఓటర్ల జాబితా గురించి అవగాహన సదస్సు # మద్దూరులో ఉపాధి కూలీ కుటుంబాన్ని పరామర్శించిన ఏపీవో- బి.జయంతి # పర్యావరణ పరిరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి # స్వీపింగ్ కార్మికుల నిరసన # ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడాలి # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్‌పై సందేశాత్మక ప్రయాణం ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి # ఇట్టి పట్టాలు మంజూరు చేయండి అని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కే.ఎస్.జవహర్ కు వినతి # చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించిన శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # ఉపాధి హామీ శ్రామికులకు ఫేస్ యాప్ రద్దు చేయాలి # పదవీ విరమణ పొందిన ఏపీ ఎన్జీవోస్ తాలూకా అధ్యక్షుడు మోహన్ రెడ్డి నీ ఘనంగా సన్మానించిన ఎస్.సాజిద్ భాష # పదవి విరమణ పొందిన మండల సర్వేయర్ విద్యపోగు. భాస్కర్ కు ఘనంగా సన్మానం చేసిన రెవెన్యూ సిబ్బంది # ఆధా"రం"ర్‌ లేక...దశాబ్ద కాలంగా అంధకారంలోనే చెంచు గిరిజన కుటుంబం... # ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ పండుగలో పాల్గొన్న టిడిపి బీసీ సెల్ మండల అధ్యక్షుడు కంభం మోహన్ గౌడ్ # ఉత్తమ పోలీస్ ఏ.ఖాజా కు ఘనంగా సన్మానం చేసిన ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు # వేంపెంటలో స్పౌస్ పెన్షన్ ల పంపిణీలో పాల్గొన్న మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ # సి ఎం ఆర్ లక్ష్యాలను నిర్ణీత గడువు లోగా పూర్తి చేయాలి... # మహిళల సంక్షేమం కోసమే ప్రభుత్వం పని చేస్తుంది...

ఉత్తమ పోలీస్ ఏ.ఖాజా కు ఘనంగా సన్మానం చేసిన ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు

Date : 01 June 2026 10:11 PM Views : 56

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడులోని, సేవా భారతి (వై ఆర్ డి ఎస్) కార్యాలయం దగ్గర ఇక్కడి నుండి వెలుగోడు పోలీస్ స్టేషన్ కు బదిలీపై వెళుతున్న ఉత్తమ పోలీస్ ఏ.ఖాజా కు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎస్.షేక్షా అలీ, మండల కో ఆప్షన్ మెంబర్ సయ్యద్.ముర్తుజాఅలీ, మాల మహానాడు రాయలసీమ అధ్యక్షుడు కలబండి.అంకన్న, డివిఎంసి మెంబర్ లింగాల నాగరాజు, సిపిఎం పార్టీ నాయకులు డి.స్వామన్న, టి.వెంకటేశ్వరరావు, వైయస్సార్సీపి మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు సయ్యద్ బాషా, వాల్మీకి సంఘం నాయకులు తిరుపతయ్య లు శాలువాలు కప్పి, పూలమాలలు మెడలో వేసి ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు ఎస్.షేక్షాఅలీ(కాంగ్రెస్), కో ఆప్షన్ మెంబర్ ఎస్.ముర్తుజాఅలీ, డివిఎంసి మెంబర్ ఎల్.నాగరాజు, కే.అంకన్న(మాల మహానాడు), సయ్యద్ బాషా (వైఎస్ఆర్సిపి), సిపిఎం పార్టీ నాయకులు డి.స్వామన్న, టి.వెంకటేశ్వరరావు, జూటూరు తిరుపతయ్య (వాల్మీకి) లు మాట్లాడుతూ మన కానిస్టేబుల్ ఏ.ఖాజా ఏ పోలీస్ స్టేషన్లో పనిచేసిన కూడా తన విధులు సిన్సియారిటీగా నిర్వహిస్తూ, నీతి, నిజాయితీగా, నిష్పక్షపాతంగా, సామరస్యంగా పనిచేయడం జరిగిందన్నారు. ఆయన సేవలను గుర్తించి గత స్వాతంత్ర దినోత్సవం రోజు జిల్లా కలెక్టర్ ఉత్తమ పోలీస్ ప్రశంసా పత్రాన్ని ప్రధానం చేయడం జరిగిందన్నారు. ఆయన నేను పోలీస్ కథ అనే గర్వం లేకుండా అధికారులతో, ప్రజా ప్రతినిధులతో, ప్రజా సంఘాల నాయకులతో, ప్రజలతో స్నేహ పూర్వకంగా ఫ్రెండ్లీ పోలీసు కు నిదర్శనంగా ఉత్తమ సేవలు అందించడం ఎంతో గర్వకారణం అన్నారు. ఆయన భవిష్యత్తులో ప్రమోషన్లు పొంది ప్రజలకు ఒక మంచి పోలీసు అధికారి గా సేవలందించాలని ఆ దేవుని ప్రార్థిస్తూ కోరుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎర్రగూడూరు టిడిపి నాయకుడు మంజుల నాగార్జున, ప్రజా సంఘాల నాయకులు మైమాకర్, జాకీర్, సోషల్ మీడియా ప్రతినిధులు గోవిందు, మోసే, నాగ స్వామి నాయక్, ఎస్.షర్పద్దీన్ అలీ, మహబూబ్ బాషా, తదితరులు పాల్గొనడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :