Thursday, 30 July 2026 08:18:19 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

ఉత్తమ పోలీస్ ఏ.ఖాజా కు ఘనంగా సన్మానం చేసిన ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు

Date : 01 June 2026 10:11 PM Views : 105

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడులోని, సేవా భారతి (వై ఆర్ డి ఎస్) కార్యాలయం దగ్గర ఇక్కడి నుండి వెలుగోడు పోలీస్ స్టేషన్ కు బదిలీపై వెళుతున్న ఉత్తమ పోలీస్ ఏ.ఖాజా కు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎస్.షేక్షా అలీ, మండల కో ఆప్షన్ మెంబర్ సయ్యద్.ముర్తుజాఅలీ, మాల మహానాడు రాయలసీమ అధ్యక్షుడు కలబండి.అంకన్న, డివిఎంసి మెంబర్ లింగాల నాగరాజు, సిపిఎం పార్టీ నాయకులు డి.స్వామన్న, టి.వెంకటేశ్వరరావు, వైయస్సార్సీపి మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు సయ్యద్ బాషా, వాల్మీకి సంఘం నాయకులు తిరుపతయ్య లు శాలువాలు కప్పి, పూలమాలలు మెడలో వేసి ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు ఎస్.షేక్షాఅలీ(కాంగ్రెస్), కో ఆప్షన్ మెంబర్ ఎస్.ముర్తుజాఅలీ, డివిఎంసి మెంబర్ ఎల్.నాగరాజు, కే.అంకన్న(మాల మహానాడు), సయ్యద్ బాషా (వైఎస్ఆర్సిపి), సిపిఎం పార్టీ నాయకులు డి.స్వామన్న, టి.వెంకటేశ్వరరావు, జూటూరు తిరుపతయ్య (వాల్మీకి) లు మాట్లాడుతూ మన కానిస్టేబుల్ ఏ.ఖాజా ఏ పోలీస్ స్టేషన్లో పనిచేసిన కూడా తన విధులు సిన్సియారిటీగా నిర్వహిస్తూ, నీతి, నిజాయితీగా, నిష్పక్షపాతంగా, సామరస్యంగా పనిచేయడం జరిగిందన్నారు. ఆయన సేవలను గుర్తించి గత స్వాతంత్ర దినోత్సవం రోజు జిల్లా కలెక్టర్ ఉత్తమ పోలీస్ ప్రశంసా పత్రాన్ని ప్రధానం చేయడం జరిగిందన్నారు. ఆయన నేను పోలీస్ కథ అనే గర్వం లేకుండా అధికారులతో, ప్రజా ప్రతినిధులతో, ప్రజా సంఘాల నాయకులతో, ప్రజలతో స్నేహ పూర్వకంగా ఫ్రెండ్లీ పోలీసు కు నిదర్శనంగా ఉత్తమ సేవలు అందించడం ఎంతో గర్వకారణం అన్నారు. ఆయన భవిష్యత్తులో ప్రమోషన్లు పొంది ప్రజలకు ఒక మంచి పోలీసు అధికారి గా సేవలందించాలని ఆ దేవుని ప్రార్థిస్తూ కోరుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎర్రగూడూరు టిడిపి నాయకుడు మంజుల నాగార్జున, ప్రజా సంఘాల నాయకులు మైమాకర్, జాకీర్, సోషల్ మీడియా ప్రతినిధులు గోవిందు, మోసే, నాగ స్వామి నాయక్, ఎస్.షర్పద్దీన్ అలీ, మహబూబ్ బాషా, తదితరులు పాల్గొనడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :