ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / అనంతపురం : నందికొట్కూరు పట్టణంలోనీ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త.జయసూర్య జన్మదిన వేడుకలు జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల నాగరాజు, కాటేపోగు నాగ సురేష్ ల ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ జన్మదినం వేడుకలకు ముఖ్య అతిథిగా గౌరవనీయులు పెద్దలు టీడీపీ మండల కన్వీనర్ & మార్కెట్ యార్డ్ డైరెక్టర్- మాండ్ర.సురేంద్ర నాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిత్త.జయసూర్య కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, కేక్ కట్ చేసి ఒకరికి ఒకరు తినిపించుకొని సంతోషంగా సంబరాలు చేసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ పెద్దలు నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇన్చార్జ్ మాండ్ర శివానంద రెడ్డి ఆశీస్సులతో ఎమ్మెల్యే గిత్త.జయసూర్య మరిన్ని పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు. ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్నరని, ఆయన మరిన్ని ఉన్నత పదవులు పొంది నియోజకవర్గ ప్రజల సంక్షేమానికి కృషి చేయాలన్నారు. ఆయన నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని, ఆ దేవుని ఆశీస్సులతో మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని వారు దేవుని ప్రార్థిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నందికొట్కూరు 2వ వార్డు కౌన్సిలర్ మొల్ల జాకీర్ హుసేన్, గిత్త.ప్రతాప్, భాస్కర్ రెడ్డి, జమీల్ లాయర్ జాకీర్, తిమ్మారెడ్డి , ఆచారి, రవీంద్ర నాయుడు, వేణు, పోలీసు రంగస్వామి, మల్యాల నాగరాజు, మల్యాల స్వాములు, ప్రసన్నలక్ష్మి, డాక్టర్ డి.వనజ, డాక్టర్ మీనాక్షి దేవి, డాక్టర్ రమణ, కుమార్, టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News