Friday, 31 July 2026 05:31:09 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు నైట్ డ్యూటీ నుంచి మినహాయింపు ఇవ్వాలి

పి ఆర్ టి యు

Date : 25 November 2025 06:28 PM Views : 1977

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు వారంలో రెండు రోజులు 3వ వంతు ఉపాధ్యాయులు నైట్ డ్యూటీ చేయాలనే ఆదేశాలను ఉపసంహరించుకోవాలని పి ఆర్ టి యు నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ చాంద్ బాష డిమాండ్ చేశారు. నంద్యాల జిల్లా, ఆత్మకూరు మండలంలోని, పలు ప్రాథమిక, ఉన్నత, గిరిజన సంక్షేమ పాఠశాలలు సందర్శించి ఉపాధ్యాయుల చేత సభ్యత్వ నమోదులు చేయించారు. ఈ సందర్భంగా పి ఆర్ టి యు నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్.చాంద్ బాష మాట్లాడుతూ ప్రధాన సమస్యలు ఆశ్రమ పాఠశాలల్లో ఉపాధ్యాయులకు నైట్ డ్యూటీ నుంచి మినహాయింపు ఇవ్వాలనీ, ఆశ్రమ పాఠశాలల్లో వార్డెన్ ను నియమించాలనీ, కాంట్రాక్ట్ టీచర్లను రెగ్యులైజ్ చేయాలనీ, పదో తరగతి పరీక్షల 100 రోజుల యాక్షన్ ప్లాన్ ను సెలవు రోజుల్లో మినహాయింపు ఇవ్వాలనీ, మహిళ ఉపాధ్యాయులకు, పిల్లల వయస్సు 18 ఏళ్లు నిండే వరకు మాత్రమే అనే నిబంధన తొలగించి చైల్డ్ కేర్ లీవ్ జీవో విడుదల చేయాలనీ, ఉపాధ్యాయుల పెండింగ్ సరెండర్ లీవ్ బకాయిలు చెల్లించాలనీ, పిఆర్సి కమిషన్ ఏర్పాటు చేయాలి, 30% మధ్యంతర భృతి ఇవ్వాలనీ, డీఎస్సీ- 2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ అమలు చేయాలనీ, సిపిఎస్ రద్దు కోసం కార్యాచరణ చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. పిఆర్టియు ఆత్మకూరు మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సి.ప్రదీప్ కుమార్, జి.హనుమంతు ల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పిఆర్టియు నాయకులు చంద్రశేఖర్, కలిముల్లా, హుస్సేన్ సాహెబ్, రషీద్, ఖాజా, మీర్ ఇబ్రాహీం, తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :