ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు వారంలో రెండు రోజులు 3వ వంతు ఉపాధ్యాయులు నైట్ డ్యూటీ చేయాలనే ఆదేశాలను ఉపసంహరించుకోవాలని పి ఆర్ టి యు నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ చాంద్ బాష డిమాండ్ చేశారు. నంద్యాల జిల్లా, ఆత్మకూరు మండలంలోని, పలు ప్రాథమిక, ఉన్నత, గిరిజన సంక్షేమ పాఠశాలలు సందర్శించి ఉపాధ్యాయుల చేత సభ్యత్వ నమోదులు చేయించారు. ఈ సందర్భంగా పి ఆర్ టి యు నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్.చాంద్ బాష మాట్లాడుతూ ప్రధాన సమస్యలు ఆశ్రమ పాఠశాలల్లో ఉపాధ్యాయులకు నైట్ డ్యూటీ నుంచి మినహాయింపు ఇవ్వాలనీ, ఆశ్రమ పాఠశాలల్లో వార్డెన్ ను నియమించాలనీ, కాంట్రాక్ట్ టీచర్లను రెగ్యులైజ్ చేయాలనీ, పదో తరగతి పరీక్షల 100 రోజుల యాక్షన్ ప్లాన్ ను సెలవు రోజుల్లో మినహాయింపు ఇవ్వాలనీ, మహిళ ఉపాధ్యాయులకు, పిల్లల వయస్సు 18 ఏళ్లు నిండే వరకు మాత్రమే అనే నిబంధన తొలగించి చైల్డ్ కేర్ లీవ్ జీవో విడుదల చేయాలనీ, ఉపాధ్యాయుల పెండింగ్ సరెండర్ లీవ్ బకాయిలు చెల్లించాలనీ, పిఆర్సి కమిషన్ ఏర్పాటు చేయాలి, 30% మధ్యంతర భృతి ఇవ్వాలనీ, డీఎస్సీ- 2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ అమలు చేయాలనీ, సిపిఎస్ రద్దు కోసం కార్యాచరణ చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. పిఆర్టియు ఆత్మకూరు మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సి.ప్రదీప్ కుమార్, జి.హనుమంతు ల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పిఆర్టియు నాయకులు చంద్రశేఖర్, కలిముల్లా, హుస్సేన్ సాహెబ్, రషీద్, ఖాజా, మీర్ ఇబ్రాహీం, తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News