ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / మహారాష్ట్ర/ముంబై : ముంబై బహుజనులు 1888, మే-11న ముంబై మాండవి కోలివాడలోని, ఓ మరాఠా జ్ఞాతి సమాజ్ హాలులో జరిగిన ఓ భారీ సభలో జ్యోతిరావుకు "మహాత్మా" బిరుదుతో సత్కరించారు. దేశంలోని ఓబీసీ ఎస్సీ ఎస్టీ మహిళలకు విద్య కోసం ఆయన చేసిన విప్లవాత్మక కృషికి గుర్తింపుగా ప్రజలు గౌరవించారు. అనాడు అందులో మరాఠా, కున్బి, అగ్రి, కోలి మాలి, బండారి లతోపాటు తెలుగు వారైన జయ కారాడి లింగు, ఈర్లా సాయన్న, వెంకయ్య కారాడి, జయ లింగన్న సాయన్న, శ్యాంబా మాగుజి హమంద్ తదితరులు ఆ ఐతిహాసిక ఉత్సవంలో పాల్గొనడం చరిత్రాత్మకం. దానిని నేడు జ్ఞాపకార్థంగా ముంబైలోని ప్రఖ్యాత ఓబీసీ ఎస్సీ తెలుగు ప్రముఖులను "రాష్ట్రపితా మహాత్మా జ్యోతిరావు ఫూలే జన్మ ద్విశతాబ్ది మహోత్సవ సమితి" ఆధ్వర్యంలో సోమవారం ప్రభాదేవిలోగల రవీంద్ర నాట్య మందిర్లో సత్కరించారు. అతిథులుగా మహారాష్ట్ర మాజీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కపిల్ పాటిల్ చేతుల మీదుగా ప్రఖ్యాత తెలుగు కవి రచయిత అంబాల జనార్ధన్ కి ప్రశంస పత్రమీచ్చి "పూలే తలపాగా" శిరస్సుపై ధరించి, షాల్వా కప్పి ఘనంగా సన్మానించారు. మరాఠీ చిత్రలేఖ ఎడిటర్ జ్ఞానేష్ మహారావు కవి నడిమెట్ల ఎల్లప్ప లకు మహాత్మ జ్యోతిరావు పూలే పుస్తకం, సర్టిఫికెట్ ఇచ్చి, శాలువాలు కప్పి ఘనంగా గౌరవించారు. అదే రీతిలో యువనేత వంగల కృష్ణ యాదవ్, నవీముంబై నుంచి మందపెల్లి లక్ష్మణ్ నాయి, రజక యువనేత తడ్కపెల్లి నరేష్, అంబేడ్కరైట్ నేత వడ్డి సూర్యనారాయణ, సామల లక్ష్మణ్ యాదవ్, దాసరి రాజేంద్ర పద్మశాలి, మూలనివాసి మాలజీలను సత్కరించారు. సభకు రోహిత్ డాలే వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
Admin
E Nivas News