ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల : ఈ రోజు నంద్యాల పట్టణంలోని, రామకృష్ణ పీజీ కాలేజ్ లో జిల్లా పిఆర్టియు కార్యవర్గ సమావేశము జిల్లా అధ్యక్షుడు వై.రాంపక్కి రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర పీఆర్టీయు అధ్యక్షులు మిట్ట కృష్ణయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ.ఎమ్. గిరి ప్రసాద్ రెడ్డి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వైష్ణవ కరుణానిధి మూర్తి లు హాజరుకావడం జరిగింది. ఉపాధ్యాయ సమస్యలపై చర్చ జరిపి, పరిష్కరిస్తామని తెలిపారు. తర్వాత నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. జిల్లా అధ్యక్షుడిగా ఎన్వి భాస్కర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా సయ్యద్.చాంద్ భాష, వర్కింగ్ ప్రెసిడెంట్ వై.రామ్ పక్కిరెడ్డి, జిల్లా గౌరవాధ్యక్షుడిగా భార్గవరామయ్య ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పలు ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని మీట్టా కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. *ప్రధాన డిమాండ్లు* పిఆర్సి కమిషన్ ఏర్పాటు చేయాలని, 30% మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించాలని కోరారు. పెండింగ్ డిఎ లు ఇవ్వాలని,ఉపాధ్యాయుల ఆర్థిక బకాయిలు చెల్లించాలని అన్నారు. 2003 డిఎస్సి వారికి మెమో 57 ప్రకారం పాత పెన్షన్ వర్తించేలా చేయాలని,10 తరగతి 100 రోజుల యాక్షన్ ప్లాన్ ను సెలవు రోజుల్లో లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పి ఆర్ టి యు కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎన్.వి. కృష్ణా రెడ్డి, కడప జిల్లా అధ్యక్షుడు బి. విశ్వనాథ్ రెడ్డి, రాష్ట్ర నాయకులు గోపాల్ రెడ్డి, విజయ్ రావు, దేవనల శ్రీను, జాకీర్, హుసేన్ సాహెబ్, రవి, కృష్ణారావు, రవీంద్ర రెడ్డి, సుమియన్, హనుమంతు మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, మండల కార్యవర్గ సభ్యులు, ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది.
Admin
E Nivas News