Saturday, 13 June 2026 02:57:46 PM
# సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి # పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలి # ఎస్ఐఆర్ శిక్షణ తరగతులలో బూత్ లెవెల్ ఏజెంట్ లకు ఓటర్ల జాబితా గురించి అవగాహన సదస్సు # మద్దూరులో ఉపాధి కూలీ కుటుంబాన్ని పరామర్శించిన ఏపీవో- బి.జయంతి # పర్యావరణ పరిరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి # స్వీపింగ్ కార్మికుల నిరసన # ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడాలి # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్‌పై సందేశాత్మక ప్రయాణం ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి # ఇట్టి పట్టాలు మంజూరు చేయండి అని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కే.ఎస్.జవహర్ కు వినతి # చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించిన శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # ఉపాధి హామీ శ్రామికులకు ఫేస్ యాప్ రద్దు చేయాలి # పదవీ విరమణ పొందిన ఏపీ ఎన్జీవోస్ తాలూకా అధ్యక్షుడు మోహన్ రెడ్డి నీ ఘనంగా సన్మానించిన ఎస్.సాజిద్ భాష # పదవి విరమణ పొందిన మండల సర్వేయర్ విద్యపోగు. భాస్కర్ కు ఘనంగా సన్మానం చేసిన రెవెన్యూ సిబ్బంది # ఆధా"రం"ర్‌ లేక...దశాబ్ద కాలంగా అంధకారంలోనే చెంచు గిరిజన కుటుంబం... # ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ పండుగలో పాల్గొన్న టిడిపి బీసీ సెల్ మండల అధ్యక్షుడు కంభం మోహన్ గౌడ్ # ఉత్తమ పోలీస్ ఏ.ఖాజా కు ఘనంగా సన్మానం చేసిన ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు # వేంపెంటలో స్పౌస్ పెన్షన్ ల పంపిణీలో పాల్గొన్న మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ # సి ఎం ఆర్ లక్ష్యాలను నిర్ణీత గడువు లోగా పూర్తి చేయాలి... # మహిళల సంక్షేమం కోసమే ప్రభుత్వం పని చేస్తుంది...

ఎర్రగూడూరు తెలుగు గంగా బ్రిడ్జిపై నాణ్యత లోపాలు

మాల మహానాడు రాయలసీమ అధ్యక్షుడు కే.అంకన్న

Date : 25 May 2026 09:34 AM Views : 69

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు:-పాములపాడు మండలంలోని, ఎర్రగూడూరు గ్రామం వద్ద తెలుగు గంగ బ్రిడ్జిపై నాణ్యత లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని మాల మహానాడు రాయలసీమ అధ్యక్షుడు కలబండి.అంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు మాల మహానాడు రాయలసీమ అధ్యక్షులు కే.అంకన్న ఎర్రగూడూరు వద్ద తెలుగు గంగ బ్రిడ్జిపై పి ఎస్ కే కంపెనీ వారు వేసిన నేషనల్ హైవే ఎన్ హెచ్ 340 సి రోడ్డును పరిశీలించగా కాంక్రీట్ పోయి, లోపల ఉన్న కడ్డీలు బయటపడి రోడ్డు పాడవుతూ వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్నూలు నన్నూరు చెక్పోస్ట్ నుండి ఆత్మకూరు రైస్ మిల్లుల వరకు పి ఎస్ కే కంపెనీ వారు వేసిన జాతీయ రహదారి నిర్మాణాల నాణ్యతను అధికారులు పట్టించుకోకపోవడం వలన అక్కడక్కడ ఇటువంటి నాణ్యత లోపాలు కనిపిస్తున్నాయని అన్నారు. ఇప్పటికైనా ఈ రోడ్డును నేషనల్ హైవే అధికారులు పరిశీలించి, ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో కంపెనీవారు నాణ్యతగా వేసే విధంగా చూడాలని కోరారు. *ఎర్రగూడూరు తెలుగు గంగ బ్రిడ్జి ప్రాముఖ్యత* జాతీయ మాల మహానాడు కలబండి.అంకన్న మాట్లాడుతూ ఎర్రగూడూరు దగ్గర తెలుగు గంగ బ్రిడ్జి దగ్గర.. ప్రతి సంవత్సరం వినాయక చవితి సందర్భంగా అనేక వినాయక విగ్రహాలు మరియు పెద్ద ఎత్తున ప్రజలు వినాయక విగ్రహాలు నిమజ్జనం ప్రతి సంవత్సరం చేస్తారు. మరియు ఇదే నూతన బ్రిడ్జి మీదుగా కర్నూలు నుండి విజయవాడ కి భారీ మెట్రిక్ టన్నుల లోడ్ లతో వస్తూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి వి జరిగినప్పుడు. నాణ్యత లోపం వలన ఏదైనా జరగరాని సమస్య జరిగితే బ్రీడ్ కి ఏమైనా జరిగితే ఎవరు బాధ్యులు అమాయకపు ప్రజలను ఇలా బ్రిడ్జి లలో ప్రమాదాలు జరగకుండా చూడాలని అన్నారు. *భానుముక్కల టర్నింగ్ దగ్గర హైవే వారు మూసివేసిన రహదారినీ వెంటనే తొలగించాలి- ప్రయాణాన్ని సురక్షితం చేయాలి* భానుముక్కల టర్నింగ్ దగ్గర హైవే వారు నిత్యం భానుముక్కల ప్రజలు అందరూ కలిసి ప్రతి రోజు ప్రయాణిస్తుంటారు. కాబట్టి హైవే వారు మూసినటువంటి రహదారిను వెంటనే తొలగించాలన్నారు. నేషనల్ హైవే అధికారులు, పి ఎస్ కే కంపెనీ వారు ప్రజలు ఇబ్బందులు కలుగ కుండా చూడాలని కోరడమైనది. అంతేకాకుండా ఎప్పటి నుండో పూర్వం నుండి కూడా ఇక్కడ బస్ స్టాప్ ఉన్నదన్నారు. ఇక్కడ ఒక భానుముక్కల ఒక్కటే కాదు బానకచర్ల , వేంపెంట, వెలుగోడు, నంద్యాల వరకు నిత్యం ప్రయాణిస్తూ ఉంటారనీ మరియు మజారా గ్రామాలు కలిసి ఉన్నాయన్నారు. కాబట్టి ఇది ఇలాగే ఉంటే బారి ఎత్తున నిరసన వ్యక్తం చేస్తామని హెచ్చరించారు.ప్రజలకు ఇబ్బంది కలుగకుండా ఈ కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని మాల మహానాడు రాయలసీమ అధ్యక్షుడు కలబండి అంకన్న కోరడమైనది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :