Wednesday, 17 June 2026 01:29:18 PM
# ఆదివాసి మహిళలను చెప్పులతో కొట్టిన ఫారెస్ట్ అధికారులును వెంటనే సస్పెండ్ చేయాలి... # జిల్లాలో వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి.. # రైతు వేదికల్లో విత్తనాలు, ఎరువుల పంపిణీ .. ! కేంద్రం పైన ఎప్పటికప్పుడు ఒత్తిడి.. # మంచిర్యాలలో ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులపై ఆర్టీఏ కొరడా.. 5 బస్సులు సీజ్ # వృద్ధాప్యంలో కొండంత అండ: రూ. 30 లక్షల ప్రమాద బీమా, రూ. 10 లక్షల సహజ మరణ బీమా కల్పించడం పట్ల సర్వత్రా హర్షం... # తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలికి ఘన స్వాగతం.. # ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని 100 శాతం విజయవంతం చేయాలి.. # ఎమ్మెల్యే పై కవిత అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.. # అంగన్‌వాడీలే చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాదులు. మంత్రి సీతక్క.. # రైతులకు విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.. # ఇందిరమ్మ ఇళ్లకు 77 లక్షల దరఖాస్తులు.. స్థలం లేనివారికీ మంజూరు.. # పేదింటి ప్రజల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ధ్యేయం # పేద ప్రజలకు న్యాయం చేసే వరకు పోరాడుతా # ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన కవిత # సింగరేణి సంస్థ సర్వతోముఖాభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దాం… # ఉప ముఖ్యమంత్రిబట్టి విక్రమార్క ను సన్మానించిన మాజీ ఎమ్మెల్యే... # మునీర్ భాయ్ పుస్తకావిష్కరణ లో పాల్గొన్న మంత్రి వివేక్ # అమావాస్య రోజు మోగనున్న బడిగంటలు.. # ప్రజల మధ్యలో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ # కార్మిక సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..! బిజెపి, బి ఆర్ ఎస్ కుట్రలను సాగనివ్వం...

పాములపాడు గొల్ల కళ్యాణ్ కి టిడిపి ప్రమాద బీమా 5 లక్షలు పంపిణీ చేసిన నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి

Date : 15 May 2026 10:33 PM Views : 60

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : మండల కేంద్రమైన పాములపాడు కు చెందిన గొల్ల కళ్యాణి కి నంద్యాల ఎంపీ డాక్టర్ భైరెడ్డి శబరి టిడిపి ప్రమాద బీమా 5 లక్షల రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ బైరెడ్డి శబరి మాట్లాడుతూ పాములపాడు గ్రామానికి, చెందిన గొల్ల వెంకటేశ్వర్లు 2026, ఫిబ్రవరి-12వ తేదీన నంద్యాల జిల్లా సమీపంలోని, జిందాల్ ఫ్యాక్టరీలో లారీ డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందడం గ్రామ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. కుటుంబానికి అండగా నిలిచిన వ్యక్తిని కోల్పోవడంతో ఆయన భార్య కళ్యాణి ఇద్దరు చిన్న పిల్లలు తీవ్ర ఆర్థిక మరియు మానసిక వేదనలో ఉన్నారన్నారు. ఈ క్లిష్ట పరిస్థితిని గుర్తించిన పాములపాడు గ్రామానికి చెందిన జిల్లా టెలికాం అడ్వైజర్ కమిటీ సభ్యుడు & తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు కురువ.రమేష్ బాధిత కుటుంబ పరిస్థితిని నంద్యాల పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి శబరి కి వివరించి, తెలుగుదేశం పార్టీ సభ్యత్వ ప్రమాద బీమా కింద రూ.5 లక్షల ఆర్థిక సహాయం త్వరితగతిన అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పేద కుటుంబం ఎదుర్కొంటున్న బాధను మనస్ఫూర్తిగా పరిగణనలోకి తీసుకున్న నంద్యాల పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి శబరి వెంటనే స్పందించి, ప్రమాద బీమా కింద రావలసిన రూ.5 లక్షల రూపాయలు సహాయం త్వరగా కుటుంబానికి అందేలా పార్టీతో మాట్లాడి చర్యలు చేపట్టడం అభినందనీయం అన్నారు. అంతేకాకుండా, వెంకటేశ్వర్లు భార్య గొల్ల.కళ్యాణి కి వితంతు పింఛన్ కూడా మంజూరు అయ్యేలా, పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. టిడిపి సభ్యత్వ ప్రమాద బీమా ఐదు లక్షల రూపాయలు రావడానికి కృషిచేసిన నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి.శబరమ్మ కు, పాములపాడు టిడిపి యువ నాయకుడు కురువ రమేష్ కు గొల్ల.కళ్యాణి, ఆమె కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బైరెడ్డి అభిమానులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొనడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: