ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : మండల కేంద్రమైన పాములపాడు కు చెందిన గొల్ల కళ్యాణి కి నంద్యాల ఎంపీ డాక్టర్ భైరెడ్డి శబరి టిడిపి ప్రమాద బీమా 5 లక్షల రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ బైరెడ్డి శబరి మాట్లాడుతూ పాములపాడు గ్రామానికి, చెందిన గొల్ల వెంకటేశ్వర్లు 2026, ఫిబ్రవరి-12వ తేదీన నంద్యాల జిల్లా సమీపంలోని, జిందాల్ ఫ్యాక్టరీలో లారీ డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్న సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందడం గ్రామ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. కుటుంబానికి అండగా నిలిచిన వ్యక్తిని కోల్పోవడంతో ఆయన భార్య కళ్యాణి ఇద్దరు చిన్న పిల్లలు తీవ్ర ఆర్థిక మరియు మానసిక వేదనలో ఉన్నారన్నారు. ఈ క్లిష్ట పరిస్థితిని గుర్తించిన పాములపాడు గ్రామానికి చెందిన జిల్లా టెలికాం అడ్వైజర్ కమిటీ సభ్యుడు & తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు కురువ.రమేష్ బాధిత కుటుంబ పరిస్థితిని నంద్యాల పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి శబరి కి వివరించి, తెలుగుదేశం పార్టీ సభ్యత్వ ప్రమాద బీమా కింద రూ.5 లక్షల ఆర్థిక సహాయం త్వరితగతిన అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పేద కుటుంబం ఎదుర్కొంటున్న బాధను మనస్ఫూర్తిగా పరిగణనలోకి తీసుకున్న నంద్యాల పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి శబరి వెంటనే స్పందించి, ప్రమాద బీమా కింద రావలసిన రూ.5 లక్షల రూపాయలు సహాయం త్వరగా కుటుంబానికి అందేలా పార్టీతో మాట్లాడి చర్యలు చేపట్టడం అభినందనీయం అన్నారు. అంతేకాకుండా, వెంకటేశ్వర్లు భార్య గొల్ల.కళ్యాణి కి వితంతు పింఛన్ కూడా మంజూరు అయ్యేలా, పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. టిడిపి సభ్యత్వ ప్రమాద బీమా ఐదు లక్షల రూపాయలు రావడానికి కృషిచేసిన నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి.శబరమ్మ కు, పాములపాడు టిడిపి యువ నాయకుడు కురువ రమేష్ కు గొల్ల.కళ్యాణి, ఆమె కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బైరెడ్డి అభిమానులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొనడం జరిగింది.
Admin
E Nivas News