ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయము నందు 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఎస్పి- సునీల్ షేరాన్. జిల్లా కలెక్టర్- జి.రాజకుమారి గణియా ల చేతుల మీదుగా మెంథా తుఫాను, తదితర భారీ వర్షాలకు అతలాకుతలమైన మండల ప్రజలకు అన్ని రకాల సేవలు అందించినందుకు గాను ఆత్మకూరు తహసీల్దార్ జి.రత్న రాధిక కు, డిప్యూటీ తహాసిల్దార్- ఎం.ఆంజనేయులు కు, సీనియర్ అసిస్టెంట్ పి.మౌలాలిలకు ఉత్తమ సేవా అవార్డులు, ప్రశంసా పత్రాలు ప్రదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆత్మకూరు తహసిల్దార్- జి.రత్న రాధిక, డిటి- ఎం. ఆంజనేయులు, సీనియర్ అసిస్టెంట్ పి.మౌలాలి లు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ సేవా అవార్డులు, ప్రశంస పత్రాలు అందుకోవడం చాలా ఆనందంగా ఉందని, మాపై ప్రజలకు ఇంకా మంచి సేవలు అందించాలని బాధ్యత పెరిగిందని అన్నారు. అవార్డు గ్రహీతలకు ఆత్మకూరు డివిజన్ ప్రజాప్రతినిధులు, విలేకరులు, ఎన్జీవోలు, ప్రజలు, రెవెన్యూ సిబ్బంది శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు.
Admin
E Nivas News