ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : గురు వ్యాస పౌర్ణమి సందర్భంగా జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి క్షేత్రంలో బుధవారం నిర్వహించిన గిరి ప్రదక్షిణలో మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, డిసిసి అధ్యక్షుడు గాజంగి నందయ్య తదితరులు పాల్గొన్నారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా గిరి ప్రదక్షిణలు చేశారు . వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆంజనేయస్వామిని ప్రార్థించినట్లు వారు తెలిపారు. ప్రజానీకమంతా కూడా దేవుళ్లను భవిష్ భక్తిశ్రద్ధలతో కొలిచినట్లయితే సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని వారు తెలిపారు. ముందుగా గిరి ప్రదక్షణ చేసి వచ్చిన మంత్రులకు వేద పండితులు పూర్ణకుంభాలతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదాలతో పాటు, ఆంజనేయస్వామి చిత్రపటాలు అందజేశారు.
Admin
E Nivas News