Wednesday, 17 June 2026 01:29:47 PM
# ఆదివాసి మహిళలను చెప్పులతో కొట్టిన ఫారెస్ట్ అధికారులును వెంటనే సస్పెండ్ చేయాలి... # జిల్లాలో వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి.. # రైతు వేదికల్లో విత్తనాలు, ఎరువుల పంపిణీ .. ! కేంద్రం పైన ఎప్పటికప్పుడు ఒత్తిడి.. # మంచిర్యాలలో ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులపై ఆర్టీఏ కొరడా.. 5 బస్సులు సీజ్ # వృద్ధాప్యంలో కొండంత అండ: రూ. 30 లక్షల ప్రమాద బీమా, రూ. 10 లక్షల సహజ మరణ బీమా కల్పించడం పట్ల సర్వత్రా హర్షం... # తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలికి ఘన స్వాగతం.. # ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని 100 శాతం విజయవంతం చేయాలి.. # ఎమ్మెల్యే పై కవిత అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.. # అంగన్‌వాడీలే చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాదులు. మంత్రి సీతక్క.. # రైతులకు విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.. # ఇందిరమ్మ ఇళ్లకు 77 లక్షల దరఖాస్తులు.. స్థలం లేనివారికీ మంజూరు.. # పేదింటి ప్రజల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ధ్యేయం # పేద ప్రజలకు న్యాయం చేసే వరకు పోరాడుతా # ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన కవిత # సింగరేణి సంస్థ సర్వతోముఖాభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దాం… # ఉప ముఖ్యమంత్రిబట్టి విక్రమార్క ను సన్మానించిన మాజీ ఎమ్మెల్యే... # మునీర్ భాయ్ పుస్తకావిష్కరణ లో పాల్గొన్న మంత్రి వివేక్ # అమావాస్య రోజు మోగనున్న బడిగంటలు.. # ప్రజల మధ్యలో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ # కార్మిక సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..! బిజెపి, బి ఆర్ ఎస్ కుట్రలను సాగనివ్వం...

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పై వస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాం..

భాజపా రాష్ట్ర నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి

Date : 12 May 2026 10:35 PM Views : 71

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : దేశం కోసం ప్రజల కోసం పోరాడే నాయకుడు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కు షాద్ నగర్ నుండి కరీంనగర్ వరకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఇటీవలే ఆయనపై వస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు షాద్ నగర్ భాజపా రాష్ట్ర నాయకుడు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. పోలీసుల దర్యాప్తు ఇంకా పూర్తికాకముందే, కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వకముందే కొందరు రాజకీయ లాభాల కోసం కావాలనే అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం చాలా బాధాకరమని, ఆరోపణలు వచ్చినంత మాత్రాన ఎవరు తప్పు చేసినట్లు కాదని, మన దేశంలో బలమైన న్యాయ వ్యవస్థ ఉందని, కోర్టులు ఉన్నాయని, చట్టం ఉందని, నిజం ఏదైనా ఉంటే దర్యాప్తు సంస్థలు మరియు కోర్టులే నిర్ణయిస్తాయని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు .దర్యాప్తు పూర్తికాకముందే ఒక ప్రజా నాయకుడిని దోషిగా చిత్రీకరించడం, వ్యక్తిత్వ హననం చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని, రాజకీయ కక్షలతో ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రయత్నాలు చేయడం తగదని, ప్రజల కోసం నిరంతరం పోరాడుతూ, తెలంగాణలో బిజెపి బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తున్న నాయకుడు బండి సంజయ్ అన్న, ప్రజా సమస్యలపై ఎప్పుడూ ముందుండే నాయకుడిపై ఇలాంటి ఆరోపణలతో ప్రజల్లో అపోహలుసృష్టించాలని ప్రయత్నించడం దురదృష్టకరమని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. బిజెపి సీనియర్ నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి సమక్షంలో, షాద్‌నగర్ ప్రాంతానికి చెందిన దాదాపు 50 మంది నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి మేము కరీంనగర్‌కు వెళ్లి బండి సంజయ్ అన్నను మర్యాదపూర్వకంగా కలిశాము. సుమారు గంటసేపు జరిగిన సమావేశంలో తెలంగాణ ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలు, పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణ మరియు ప్రజలకు మరింత దగ్గరగా పనిచేసే అంశాలపై విస్తృతంగా చర్చించాము. ఈ సందర్భంగా మేమంతా బండి సంజయ్ అన్నకు సంపూర్ణ మద్దతు ప్రకటించాము. ప్రజల కోసం నిజాయితీగా పనిచేసే నాయకత్వానికి షాద్‌నగర్ బిజెపి కుటుంబం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. అసత్య ఆరోపణలు, దుష్ప్రచారాలు ఎంత చేసినా సత్యాన్ని ఆపలేరు. చివరికి నిజమే గెలుస్తుంది, ధర్మమే నిలుస్తుందని పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :