ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : దేశం కోసం ప్రజల కోసం పోరాడే నాయకుడు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కు షాద్ నగర్ నుండి కరీంనగర్ వరకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఇటీవలే ఆయనపై వస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు షాద్ నగర్ భాజపా రాష్ట్ర నాయకుడు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. పోలీసుల దర్యాప్తు ఇంకా పూర్తికాకముందే, కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వకముందే కొందరు రాజకీయ లాభాల కోసం కావాలనే అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం చాలా బాధాకరమని, ఆరోపణలు వచ్చినంత మాత్రాన ఎవరు తప్పు చేసినట్లు కాదని, మన దేశంలో బలమైన న్యాయ వ్యవస్థ ఉందని, కోర్టులు ఉన్నాయని, చట్టం ఉందని, నిజం ఏదైనా ఉంటే దర్యాప్తు సంస్థలు మరియు కోర్టులే నిర్ణయిస్తాయని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు .దర్యాప్తు పూర్తికాకముందే ఒక ప్రజా నాయకుడిని దోషిగా చిత్రీకరించడం, వ్యక్తిత్వ హననం చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని, రాజకీయ కక్షలతో ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రయత్నాలు చేయడం తగదని, ప్రజల కోసం నిరంతరం పోరాడుతూ, తెలంగాణలో బిజెపి బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తున్న నాయకుడు బండి సంజయ్ అన్న, ప్రజా సమస్యలపై ఎప్పుడూ ముందుండే నాయకుడిపై ఇలాంటి ఆరోపణలతో ప్రజల్లో అపోహలుసృష్టించాలని ప్రయత్నించడం దురదృష్టకరమని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. బిజెపి సీనియర్ నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి సమక్షంలో, షాద్నగర్ ప్రాంతానికి చెందిన దాదాపు 50 మంది నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి మేము కరీంనగర్కు వెళ్లి బండి సంజయ్ అన్నను మర్యాదపూర్వకంగా కలిశాము. సుమారు గంటసేపు జరిగిన సమావేశంలో తెలంగాణ ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలు, పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణ మరియు ప్రజలకు మరింత దగ్గరగా పనిచేసే అంశాలపై విస్తృతంగా చర్చించాము. ఈ సందర్భంగా మేమంతా బండి సంజయ్ అన్నకు సంపూర్ణ మద్దతు ప్రకటించాము. ప్రజల కోసం నిజాయితీగా పనిచేసే నాయకత్వానికి షాద్నగర్ బిజెపి కుటుంబం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. అసత్య ఆరోపణలు, దుష్ప్రచారాలు ఎంత చేసినా సత్యాన్ని ఆపలేరు. చివరికి నిజమే గెలుస్తుంది, ధర్మమే నిలుస్తుందని పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు.
Admin
E Nivas News