Wednesday, 17 June 2026 01:33:28 PM
# ఆదివాసి మహిళలను చెప్పులతో కొట్టిన ఫారెస్ట్ అధికారులును వెంటనే సస్పెండ్ చేయాలి... # జిల్లాలో వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి.. # రైతు వేదికల్లో విత్తనాలు, ఎరువుల పంపిణీ .. ! కేంద్రం పైన ఎప్పటికప్పుడు ఒత్తిడి.. # మంచిర్యాలలో ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులపై ఆర్టీఏ కొరడా.. 5 బస్సులు సీజ్ # వృద్ధాప్యంలో కొండంత అండ: రూ. 30 లక్షల ప్రమాద బీమా, రూ. 10 లక్షల సహజ మరణ బీమా కల్పించడం పట్ల సర్వత్రా హర్షం... # తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలికి ఘన స్వాగతం.. # ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని 100 శాతం విజయవంతం చేయాలి.. # ఎమ్మెల్యే పై కవిత అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.. # అంగన్‌వాడీలే చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాదులు. మంత్రి సీతక్క.. # రైతులకు విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.. # ఇందిరమ్మ ఇళ్లకు 77 లక్షల దరఖాస్తులు.. స్థలం లేనివారికీ మంజూరు.. # పేదింటి ప్రజల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ధ్యేయం # పేద ప్రజలకు న్యాయం చేసే వరకు పోరాడుతా # ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన కవిత # సింగరేణి సంస్థ సర్వతోముఖాభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దాం… # ఉప ముఖ్యమంత్రిబట్టి విక్రమార్క ను సన్మానించిన మాజీ ఎమ్మెల్యే... # మునీర్ భాయ్ పుస్తకావిష్కరణ లో పాల్గొన్న మంత్రి వివేక్ # అమావాస్య రోజు మోగనున్న బడిగంటలు.. # ప్రజల మధ్యలో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ # కార్మిక సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..! బిజెపి, బి ఆర్ ఎస్ కుట్రలను సాగనివ్వం...

తల్లిదండ్రుల మరణంతో అనాధలైన చిన్నారులు...

Date : 23 March 2026 09:59 PM Views : 126

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కరీంనగర్ టూ టౌన్ ఎస్ఐ చంద్రశేఖర్ దంపతులు ఆత్మహత్య చేసుకోవడంతో వారిద్దరి కుమారుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఆ ఇద్దరూ చిన్నారులను చూస్తా ఉంటే కంటతడి పెట్టని వారు లేరు. చిన్నారులు వచ్చిరాని మాటలతో ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే రోదించని వారు లేరు. పసిప్రాయంలో ఆప్యాయంగా ఉగ్గు పాలు పట్టావు.పేరు పెట్టి పిలుస్తూ సంబరపడ్డావు.చిన్న దెబ్బతగిలినా అల్లాడిపోయావు.. తలదువ్వి, పౌడరు వేసి బంగారాలంటూ మురిసిపోయావు. మొదటి రోజు పాఠశాలలో దింపి వెళుతూ కంట్లో నీరు తెచ్చుకున్న నువ్వేనా..! మమ్మల్ని ఒంటరి చేసి వెళ్లింది. మమ్మల్ని విడిచి ఎలా వెళ్లాలనిపించింది అమ్మా..? మేము పుట్టామని సంబరపడ్డావు. మిఠాయిలు పంపిణీ చేసి స్నేహితులకు పార్టీలు ఇచ్చావు.. గుండెలపై ఎత్తుకొని ఆడించావు. వేలు పట్టి నడక నేర్పించావు. అవసరాలు తెలుసుకొని అన్నీ కొనిపెట్టావు. తుంటరి పని చేస్తే దండించి నీలో నువ్వే బాధపడ్డావు..పాఠశాల నుంచి వచ్చి రాసుకుంటుంటే గొప్పవాళ్లవుతామని మనసులో ఆనందపడ్డావు. అల్లారు ముద్దుగా పెంచుకొన్న మమ్మల్ని ఇలా అనాథలను చేసి వెళ్లావేంటి నాన్నా..? పుట్టిన రోజులు ఘనంగా చేశారు.. సంప్రదాయ దుస్తుల్లో చూసి మురిసిపోయారు. కడుపు నొప్పితో అమ్మ.. అమ్మ లేదని మీరు ఆత్మహత్యచేసుకొన్నారు. మమ్మల్ని ఎవరు పెంచి, పెద్ద చేస్తారనుకున్నారు.. పదేళ్లు, ఆరేళ్ల వయసున్న మా గురించి మీకు ఆలోచన రాలేదా మేము రేపటి నుంచి ఎవరిని పిలవాలి అమ్మా..! నాన్నా..! అని..? ఆత్మహత్య చేసుకొనే ముందు అమ్మానాన్నలు.. ఒక్క క్షణం మాలాంటి పిల్లల గురించి ఆలోచించరూ.. అశ్వత్థామ, అభిమన్యు (ఎస్సై చంద్రశేఖర్, దివ్య దంపతుల కుమారులు) పరిస్థితి ఆ గంగ గోచరంగా మారడంతో కుటుంబీకుల ఆవేదన వర్ణనాతీతం.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :