ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కరీంనగర్ టూ టౌన్ ఎస్ఐ చంద్రశేఖర్ దంపతులు ఆత్మహత్య చేసుకోవడంతో వారిద్దరి కుమారుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఆ ఇద్దరూ చిన్నారులను చూస్తా ఉంటే కంటతడి పెట్టని వారు లేరు. చిన్నారులు వచ్చిరాని మాటలతో ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే రోదించని వారు లేరు. పసిప్రాయంలో ఆప్యాయంగా ఉగ్గు పాలు పట్టావు.పేరు పెట్టి పిలుస్తూ సంబరపడ్డావు.చిన్న దెబ్బతగిలినా అల్లాడిపోయావు.. తలదువ్వి, పౌడరు వేసి బంగారాలంటూ మురిసిపోయావు. మొదటి రోజు పాఠశాలలో దింపి వెళుతూ కంట్లో నీరు తెచ్చుకున్న నువ్వేనా..! మమ్మల్ని ఒంటరి చేసి వెళ్లింది. మమ్మల్ని విడిచి ఎలా వెళ్లాలనిపించింది అమ్మా..? మేము పుట్టామని సంబరపడ్డావు. మిఠాయిలు పంపిణీ చేసి స్నేహితులకు పార్టీలు ఇచ్చావు.. గుండెలపై ఎత్తుకొని ఆడించావు. వేలు పట్టి నడక నేర్పించావు. అవసరాలు తెలుసుకొని అన్నీ కొనిపెట్టావు. తుంటరి పని చేస్తే దండించి నీలో నువ్వే బాధపడ్డావు..పాఠశాల నుంచి వచ్చి రాసుకుంటుంటే గొప్పవాళ్లవుతామని మనసులో ఆనందపడ్డావు. అల్లారు ముద్దుగా పెంచుకొన్న మమ్మల్ని ఇలా అనాథలను చేసి వెళ్లావేంటి నాన్నా..? పుట్టిన రోజులు ఘనంగా చేశారు.. సంప్రదాయ దుస్తుల్లో చూసి మురిసిపోయారు. కడుపు నొప్పితో అమ్మ.. అమ్మ లేదని మీరు ఆత్మహత్యచేసుకొన్నారు. మమ్మల్ని ఎవరు పెంచి, పెద్ద చేస్తారనుకున్నారు.. పదేళ్లు, ఆరేళ్ల వయసున్న మా గురించి మీకు ఆలోచన రాలేదా మేము రేపటి నుంచి ఎవరిని పిలవాలి అమ్మా..! నాన్నా..! అని..? ఆత్మహత్య చేసుకొనే ముందు అమ్మానాన్నలు.. ఒక్క క్షణం మాలాంటి పిల్లల గురించి ఆలోచించరూ.. అశ్వత్థామ, అభిమన్యు (ఎస్సై చంద్రశేఖర్, దివ్య దంపతుల కుమారులు) పరిస్థితి ఆ గంగ గోచరంగా మారడంతో కుటుంబీకుల ఆవేదన వర్ణనాతీతం.
Admin
E Nivas News