ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని సాంఘిక సంక్షేమ పాఠశాల లో ఏడవ తరగతి చదువుతున్న శ్రీహిందూ విద్యార్థిని తోటి స్నేహితులతో గొడవ జరగడంతో మనస్థాపం చెంది హాస్టల్ లోనే క్రిమిసంహారకమందు సేవించడంతో మంచిర్యాల పట్టణంలోనీ ప్రైవేటు ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. చికిత్స పొందుతూ శ్రీహిందూ విద్యార్థిని మృతి చెందింది . ఆదివారం మంచిర్యాల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కుటుంబ సభ్యులను మాజీ ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే బాల్క సుమన్ పరామర్శించారు. నిరుపేద విద్యార్థి కుటుంబాన్ని ఆదుకోవాలని వారి కుటుంబం లో ఒకరికి ప్రభుత్వఉద్యోగం తోపాటు50లక్షల ఎక్స్ గ్రేషియా మరియు 5 ఎకరాల భూమి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ బాల్క సుమన్ వెంట నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
E Nivas News