ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడానికి విత్తన ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు తెలిపారు. ఆదివారం మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం చందారం గ్రామం సమీపంలో చందారం గ్రామ రైతు పొదుపు పరపతి మరియు మార్కెటింగ్ పరస్పర సహాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ గ్రామీణ విత్తనోత్పత్తి, విత్తన శుద్ధి కేంద్రాన్ని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ ప్రాంత రైతులకు నాణ్యమైన విత్తనాలు మార్కెటింగ్ కంటే తక్కువ రేటుకు సరైన ధరలకు అందించినప్పుడే రైతులకు న్యాయం చేస్తారని ఎమ్మెల్యే తెలిపారు. తప్పనిసరి ఈ సహకార సంఘం రైతులకు నాణ్యమైన తక్కువ రేటుకు విత్తనాలు అందించాలని సూచించారు. మంచిర్యాల జిల్లాలో ఇతర నియోజకవర్గాల కంటే మంచిర్యాల నియోజవర్గం అభివృద్ధి దశలో కలెక్టర్ సహకారంతో ముందు ఉన్నదని తెలిపారు.
గతంలో పాలించిన ప్రభుత్వాల కంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని రంగాలలో అభివృద్ధి జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు రైతుల పక్షాన ఉంటుందని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిసిపి భాస్కర్ , జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సురేఖ, జిల్లా సహకార సంఘం అధికారి కరుణాకర్ , వివిధ శాఖ చైర్మన్లు, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, సంఘాల నాయకులు, రైతులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News