ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మంథనిలోని పలు ప్రైవేటు ఆసుపత్రులు, క్లినికల్ ల్యాబ్ లను సోమవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి వి వాణిశ్రీ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ప్రైవేట్ ఆసుపత్రుల రిజిస్ట్రేషన్ పత్రాలు, టారిఫ్ బోర్డు ( ధరల పట్టిక) ప్రదర్శించరా లేదా , ఇతర నిబంధనలు పాటిస్తున్నారా అనే వివరాలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మంథని లో రెండు ఆసుపత్రులకు రిజిస్ట్రేషన్ లేనట్టు గుర్తించామని, ఒక హాస్పిటల్ అడ్రస్ మారిందని, రిజిస్ట్రేషన్ లో అడ్రస్ మార్పు చేసుకోలేదని గుర్తించి వారికి నోటీసులు జారీ చేశామన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులు విధిగా తెలంగాణ క్లినికల్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్-2010 మరియు రూల్స్ 2022 ప్రకారం తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని లేనిపక్షంలో వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంట ప్రోగ్రాం అధికారి డాక్టర్ శ్రీ రాములు,వైద్య అధికారీ డా. లక్ష్మీ భవానీ, డిప్యూటీ మాస్ మీడియా అధికారి ఎస్ వెంకటేశ్వర్లు ఉన్నారు.
Admin
E Nivas News