ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంవెంకట్రావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని పదివేల ఐదు వందల మంది (10, 500) 1 సంవత్సరం నుండి 19 సంవత్సరాల వయస్సు గల పిల్లలను గుర్తించి 90 శాతం మంది పిల్లలకు సోమవారం నాడు అల్బెండొజాల్ మాత్రలను అందజేశామని , మిగిలిన వారికి ఈనెల 20 తారీకు నాడు మాప్ అప్ డే రోజు మాత్రలను అందజేసి వందశాతం లక్ష్యాన్ని పూర్తి చేస్తామనివెంకట్రావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ సమత తెలిపారు . లక్షెట్టిపేట మున్సిపల్ పరిధిలోని పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల లో మున్సిపల్ చైర్ పర్సన్ దొంత అంజలి నర్సయ్య చేతుల మీదుగా విద్యార్థులకు టాబ్లెట్స్ అందించి కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఆమె తెలిపారు. ఈసందర్భంగా వైద్యాధికారి మాట్లాడుతూ ప్రతీ ఆరు నెలలకు ఒకసారి అల్బెండొజాల్ మాత్రలను ప్రభుత్వం అందజేస్తుందని తప్పకుండా విద్యార్థులు ప్రతీ ఒక్కరు వీటిని తీసుకోవాలని అన్నారు. ఈ మాత్రలను తీసుకోవడం వల్ల విద్యార్థుల శారీరక, మానసిక ఆరోగ్యం మరింత మెరుగుపడి ఉన్నతంగా ఎదిగేందుకు తోడ్పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దారు దిలీప్ కుమార్, మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్ , ఎంపిడీఓ మధుసుధన్ , ఇంచార్జీ ఎంఈఓ శైలజ , హెచ్ఈఓ దేవేందర్, హెల్త్ సూపర్ వైజర్ శోభ, హెల్త్ అసిస్టెంట్లు గఫూర్ , వేణు , ఇసాక్ అహ్మద్, ఏఎన్ఎం సుజా, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.
Admin
E Nivas News