ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : పట్టణంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల బాలిక హనీష జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు బుధవారం ప్రిన్సిపాల్ రమా కళ్యాణి తెలిపారు. మహబూబబాద్ జిల్లా నెల్లికుదురులో నిర్వహించిన రాష్ట్రస్థాయి బాస్కట్ బాల్ పోటీల్లో గురుకుల పాఠశాల నుండి బాలిక విశేష ప్రతిభ కనబరిచి విజయం సాధించినట్లు తెలిపారు . ఈ పోటీలో జమిడి ప్రవల్లిక అనే విద్యార్థిని 44 వ జూనియర్ విభాగంలో అద్భుత ప్రదర్శన కనబరచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్టు తెలిపారు. నవంబర్ 7,8,9 వరకు ఘజియాబాద్ (ఉత్తరప్రదేశ్) లో జరగబోయే జాతీయ బాస్కట్ బాల్ పోటీల్లో ఆమె తెలంగాణ రాష్ట్ర తరపున ప్రాతినిధ్యం వహించ నున్నట్లు చెప్పారు . హనీష విజయం పై పాఠశాల ప్రిన్సిపాల్ కె. రమా కళ్యాణి హర్షం వ్యక్తం చేశారు. వారికి శిక్షణ ఇచ్చి ప్రొత్సహించిన డి. రమాదేవి సి. హెచ్. మమతలను అభినందించాురు. నవంబర్7,8, 9 న నిర్వహించే పోటీలో పాల్గొంటారన్నారు. జాతీయ స్థాయిలో కూడా రాణించాలని ఆకాంక్షించారు.
Admin
E Nivas News