Friday, 31 July 2026 02:37:04 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

వలపు వలతో ఎనిమిది లక్షల స్వాహా

అమ్మాయి గొంతుతో మోసం చేస్తున్న ఘరానా ముఠా అరెస్ట్

Date : 27 October 2025 09:06 PM Views : 240

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : వలపుల వల వేసి అమ్మాయిల గొంతుతో మాట్లాడుతూ సైబర్ మోసాలకు పాల్పడుతు అమాయక ప్రజలను బురిడీ కొట్టిస్తున్న ఘరానా ముఠాను అరెస్ట్ చేసినట్లు సోమవారం ఆదిలాబాద్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి పేర్కొన్నారు. వివరాల్లోకి వెళితే ఆదిలాబాద్ కు చెందిన ఎం. లక్ష్మీకాంత్ తన వివాహానికి ఆన్లైన్, యుట్యూబ్ లో వివాహ వధువుల కొరకు శోధిస్తున్న సమయంలో కృష్ణవేణి అనే అమ్మాయి ఫోటోతో యూట్యూబ్ నందు రూపవత్ శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి బాధితునికి పరిచయమయ్యాడు. కృష్ణవేణి అనే అమ్మాయి ఉందని నమ్మబలికి మాలోత్ మంజి అనే మోసగాని పరిచయం చేశాడు. ప్రధాన నిందితుడు మాలోత్ మంజి బాధితున్ని కృష్ణవేణి అనే అమ్మాయి పేరుతో, మహిళ గొంతుతో మాట్లాడి తను ఒక ధనవంతురాలనని తన ఆస్తులు కోర్టులో చిక్కుకున్నాయని నమ్మబలికింది. లాయర్ కు డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది అదేవిధంగా వారి వివాహం తర్వాత తన ఆస్తులను తన వ్యాపారాన్ని బాధితుడు పూర్తిగా చూసుకోవాలి అని చెప్పి అతని వద్ద నుండి విడతలవారీగా రూ. 8 లక్షలు మోసం చేసి దండుకున్నారని తెలిపారు. అదేవిధంగా తనకు బంగారం వ్యాపారాలు ఉన్నాయని వాటన్నింటిని నువ్వే చూసుకోవాలని నమ్మించడం జరిగిందన్నారు. ఈ సందర్భంలో మహిళ గొంతుతో మాట్లాడిన ప్రధాన నిందితుడి మోసంలో పడిన బాధితుడు విడతల వారీగా ఎనిమిది లక్షలు ఇచ్చి మోసపోయానని గ్రహించి 1930 ద్వారా సైబర్ ఫిర్యాదు చేయగా, ఈనెల 25న ఆదిలాబాద్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన ఆదేశాల మేరకు సైబర్ సెల్, వన్ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం సూర్యాపేట జిల్లాలో ముగ్గురు నిందితులను పట్టుకొని అరెస్టు చేయడం జరిగిందన్నారు. నిందితుల నుండి ఒకటిన్నర లక్షల రూపాయల నగదు, మూడు మొబైల్స్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ సమావేశంలో wps ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్, సైబర్ సెల్ ఎస్ ఐ గోపికృష్ణ, వన్ టౌన్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ గోకుల్ జాదవ్, హెడ్ కానిస్టేబుల్ ఏ రమేష్, ఐటీ సెల్ కానిస్టేబుల్ అన్వేష్, సిబ్బంది పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :