Friday, 31 July 2026 12:44:53 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

మంథని లో కాక వెంకటస్వామి వర్ధంతి వేడుకలు

Date : 22 December 2025 03:11 PM Views : 346

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు ఆయిలి ప్రసాద్ ఆధ్వర్యంలో మంథని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్వర్గీయ (కాకా) గడ్డం వెంకటస్వామి వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మండల శాఖ అధ్యక్షులు ఆయిలి ప్రసాద్, మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదుల వెంకన్న, జిల్లా ఉపాధ్యక్షులు నూకల బానయ్య, ఎస్సీ సెల్ డివిజన్ అధ్యక్షులు మంథని సత్యం, మాజీ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఎరుకల ప్రవీణ, బీసీ సెల్ మండల అధ్యక్షులు ఐలి శ్రీనివాస్, మాజీ ఎంపీపీ కొండ శంకర్ లు మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటులో కాకా కీలక పాత్ర పోషించారని తెలిపారు. హైదరాబాద్లో ఇండ్లు లేని వేలది మందికి గుడిసెలు వేయించి పట్టాలు ఇప్పించారని గుర్తు చేశారు. బడుగు బలహీన వర్గాల సమస్యల పరిష్కారానికి కృషి చేశారన్నారు. ప్రైవేట్ రంగంలో తొలిసారి పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చారన్నారు. కాకా వెంకటస్వామి వారసులు గడ్డం వివేక్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణలు కాక వారసత్వాన్ని ముందు తీసుకెళుతున్నారన్నారు. మంత్రి శ్రీధర్ బాబు, యువనేత దుద్దిళ్ళ శ్రీను బాబులు ముఖ్య పాత్ర పోషించి పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణ ను భారీ మెజార్టీతో గెలిపించారన్నారు. పెద్దపెల్లి ఎంపీగా మంథని నియోజక వర్గానికి ఎంపీ నిధులను కేటాయించి ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పాటు చేయాలని నాయకులు కోరారు. వెంకటస్వామి ఆనాడు సింగరేణి మరి ఎఫ్సీఐ కంపెనీలు నష్టాలలో కోరుకుపోతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి దానికి ప్రత్యేక నిధులు తీసుకువచ్చి లాభాల బాటలో వేసినటువంటి మహానేత వెంకట స్వామివారిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకురాలు, అనుబంధ సంఘాల నాయకులు, అన్ని విభాగాల నాయకులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :