Friday, 31 July 2026 06:30:01 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

ఘనంగా హనుమత్ సంకల్ప శోభయాత్ర..

ఆంజనేయ శరణు ఘోషతో మార్మోగిన లక్షెట్టిపేట...

Date : 26 March 2026 10:37 PM Views : 150

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట లో శ్రీరామ నవమి వేడుకలు శుక్రవారం జరగనున్న నేపథ్యంలో గురువారం హనుమత్ సంకల్ప మహా శోభయాత్ర, అన్న ప్రసాద వితరణను ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సతీమణి, మాజీ డీసీసీ అధ్యక్షురాలు సురేఖ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ దొంత అంజలి నర్సయ్య, వైస్ చైర్ పర్సన్ మోత్కూరి రాజేశ్వరివెంకటస్వామి గౌడ్ ల నేతృత్వంలో పాత బస్టాండ్ నుంచి కరీంనగర్ చౌరస్తాలోని ఎస్ పీ ఆర్ గార్డెన్ వరకు హనుమాన్ మాల ధారణ స్వాములు శోభ యాత్ర నిర్వహించడంతో లక్షెట్టిపేట పట్టణమంతా ఆంజనేయ స్వామి శరణు ఘోషతో మార్మ్రోగింది. గాంధీ చౌకులో మున్సిపల్ చైర్ పర్సన్ దొంత అంజలి నర్సయ్య హనుమాన్ శోభయాత్రను టెంకాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం స్వాములు డీజే పాటలతో, నృత్యాలతో హోరేత్తించారు. బైక్ ర్యాలీ ద్వారా ఎస్పీ ఆర్ ఫంక్షన్ హల్ కు చేరుకుని హనుమాన్ చాలీసా పారాయణం, పూజ కార్యక్రమాలు నిర్వహించారు. మాజీ డీసీసీ అధ్యక్షురాలు స్వయంగా హనుమాన్ స్వాములకు అన్న ప్రసాద వితరణ చేశారు.ఎంతో నియమ నిష్టలతో హనుమాన్ స్వాములు తమ భక్తిని చాటుకుంటున్నారని కొనియాడారు. ఈ మంచి కార్యక్రమంలో భాగస్వాములం అయినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతున్ని కోరుకుంటున్నట్లు తెలిపారు.కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటుందని వెల్లడించారు.

ప్రతి ఒక్కరూ ధర్మ మార్గంలో నడవాలని, హనుమాన్ కృప అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఆరీఫ్, మండల అధ్యక్షుడు పింగళి రమేష్, ఆర్ టీ ఏ మెంబర్ అంకతి శ్రీనివాస్, కౌన్సిలర్లు బిరుదుల సత్యనారాయణ, చిన్నయ్య, చంద్రమౌళి, పెండెం పద్మ రాజు, నాయకులు, కార్యకర్తలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :