ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : బీసీ ఎస్సీ.ఎస్టీ.జే.ఏ.సీ.రాష్ట్ర క న్వీ నర్ డాక్టర్ విశారదన్ మహ రాజ్.ఆదేశాల మేరకు బీసీ.ఎస్సీ.ఎస్టీ.జేసి మంథని నియోజకవర్గ నాయకులు చిట్యాల శ్రీనివాస్, మండల కమిటీ ఆధ్వర్యంలో క్రోవతుల ర్యాలీ కాటారం అంబేద్కర్ చౌర స్తాలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ నాగర్ కర్నూల్ జిల్లా కమ్మెర గ్రామంలో బీసీ రజక(చాకలి) కుటుంబం పై జరిగిన దాడికి, రెండు నెలల పసిపాప చంపినందుకు గాను బీసీ,ఎస్సీ,ఎస్టీ జేఏసీ కాటారం మండల కమిటీ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి నిరసన చేపట్టారు. నిందితుల నీ వెంటనే అరెస్ట్ చేసి చట్టపరంగా శిక్షించాలి అని. దీనికి పూర్తి బాధ్యత ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డిదే అని. కుటుంబానికి పూర్తి రక్షణ కల్పించాలి అని, రెడ్ల కులదు రహంకారంతో చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, నిందితుల్ని అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోకుంటే భవిష్యత్ లో భారీ నిరసనలు ముఖ్యమంత్రికి తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో దళిత బంధు సాధన సమితి అధ్యక్షుడు నౌలా సంపత్, ఉపాధ్యక్షుడు జక్కన్న, చందు, వార్డుమెంబర్ రాజబాబు డీఎస్పీ నాయకులు ఖమ్మంపల్లి రమేష్, చిర్ర శ్రీకాంత్, దేవేందర్, రజక సంఘం నాయకులు, అంబేద్కర్ సంఘం నాయకులు అత్కూరి శంకర్, అన్వర్, తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News