ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణసీఎం రేవంత్ రెడ్డిసర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పేద వర్గాల ప్రజలకు శుభవార్త చెప్పింది. శనివారం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి, అధ్యక్ష తన జరిగిన మంత్రి మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణ లో పేదల ఇండ్ల నిర్మాణానికి పెద్దపీట వేయాలని మంత్రి మండలి నిర్ణయించింది. పూరి గుడిసెలు లేని ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిది ద్దాలని కంకణం కట్టుకుంది.జూన్ 1 నుంచి ఇందిర మ్మ పథకం రెండో విడత కింద పేద కుటుంబాలకు 2. లక్షల 50 వేల ఇళ్లు మంజూరుకు ఆమోదం తెలిపింది. ఇప్పటికే మొదటి విడత కింద పేద వర్గాల ప్రజలకు ఇండ్ల నిర్మాణం చేపట్టిన ప్రభుత్వంతాజాగా రెండో విడత ఇందిర మ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది. రెండో విడ తలో భాగంగా రాష్ట్రం లోని లక్షల మంది పేద వర్గాల ప్రజలకు ఇండ్లు మంజూరు చేయాలని నిర్ణయించింది. ప్రతి నియోజకవర్గానికి 2వేల చొప్పున ఇందిర మ్మ ఇండ్లు మంజూరు కు అనుమతి ఇచ్చిం ది. అయితే, తొలి విడతలో ప్రారంభిం చిన ఇందిరమ్మ ఇండ్ల లో జూన్ 2వ తేదీ నాటికి దాదాపు లక్ష గృహ ప్రవేశాలు జర గాలని నిర్ణయించింది. రాష్ట్రంలో నిర్వహించి న సర్వేల ప్రకారం15వేల కుటుంబాలు ఇప్పటికీ గుడిసెల్లో నివాసం ఉంటున్నా రని, వెంటనే వారికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని కేబినెట్ నిర్ణయించిం ది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికా రంలో ఉన్న సమయం లో మంజూరు చేసి, పూర్తికాక నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లకు కూడా సాయం అందించాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అదేవిధంగా హైదరా బాద్ మహానగరంలో క్యూర్ పరిధిలో ఉన్న 24 నియోజకవర్గా ల్లోని పేదలకు లక్ష ఇండ్లను కట్టించి ఇవ్వాలని ప్రభుత్వం తీర్మానించింది.కొలాం ఆదివాసీలకు కుము రం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం కొఠారి గ్రామంలో సర్కార్ కట్టించిన ఇందిరమ్మ ఇండ్లను జూన్1వ తేదీన ప్రారంభిస్తామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.సీఎం రేవంత్ రెడ్డి,డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా మంత్రులు అందరూ ఆ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పా రు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేసేందు కు కావాల్సిన భూ సేకరణ, పునరావా సం, మౌలిక వసతుల సదుపాయాల కల్పన కు రూ.587 కోట్లను కేటాయిస్తూ.. తెలంగా ణ కేబినెట్ నిర్ణయాలు తీసుకుంది.
Admin
E Nivas News