Wednesday, 17 June 2026 01:52:12 PM
# ఆదివాసి మహిళలను చెప్పులతో కొట్టిన ఫారెస్ట్ అధికారులును వెంటనే సస్పెండ్ చేయాలి... # జిల్లాలో వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి.. # రైతు వేదికల్లో విత్తనాలు, ఎరువుల పంపిణీ .. ! కేంద్రం పైన ఎప్పటికప్పుడు ఒత్తిడి.. # మంచిర్యాలలో ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులపై ఆర్టీఏ కొరడా.. 5 బస్సులు సీజ్ # వృద్ధాప్యంలో కొండంత అండ: రూ. 30 లక్షల ప్రమాద బీమా, రూ. 10 లక్షల సహజ మరణ బీమా కల్పించడం పట్ల సర్వత్రా హర్షం... # తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలికి ఘన స్వాగతం.. # ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని 100 శాతం విజయవంతం చేయాలి.. # ఎమ్మెల్యే పై కవిత అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.. # అంగన్‌వాడీలే చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాదులు. మంత్రి సీతక్క.. # రైతులకు విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.. # ఇందిరమ్మ ఇళ్లకు 77 లక్షల దరఖాస్తులు.. స్థలం లేనివారికీ మంజూరు.. # పేదింటి ప్రజల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ధ్యేయం # పేద ప్రజలకు న్యాయం చేసే వరకు పోరాడుతా # ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన కవిత # సింగరేణి సంస్థ సర్వతోముఖాభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దాం… # ఉప ముఖ్యమంత్రిబట్టి విక్రమార్క ను సన్మానించిన మాజీ ఎమ్మెల్యే... # మునీర్ భాయ్ పుస్తకావిష్కరణ లో పాల్గొన్న మంత్రి వివేక్ # అమావాస్య రోజు మోగనున్న బడిగంటలు.. # ప్రజల మధ్యలో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ # కార్మిక సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..! బిజెపి, బి ఆర్ ఎస్ కుట్రలను సాగనివ్వం...

షెడ్యూల్డ్ కులముల నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు...

చాతరాజులదుర్గాప్రసాద్

Date : 19 March 2026 07:20 AM Views : 156

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లాలోని షెడ్యూల్ కులమునకు చెందిన నిరుద్యోగ యువతీ యువకులకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి ఆర్థిక పురోగతి పెంపొందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని జిల్లా షెడ్యూల్డ్ కలముల సేవా సహకార అభివృద్ధి సంఘం కార్యనిర్వాహక సంచాలకులు చాతరాజుల దుర్గాప్రసాద్ బుధవారంఒక ప్రకటనలో తెలిపారు. రవాణా రంగం ఎలక్ట్రికల్ లో ఈ.వి. 2 వీలర్ ను 90 శాతం రాయితీ, 10 శాతం బ్యాంకు రుణం కల్పించి సగటు యూనిట్ ధర 1 లక్ష రూపాయలతో 185 యూనిట్లు, ఈ. వి. త్రిచక్ర వాహనం (సరుకు రవాణా, ప్రయాణికుల రవాణా) ను 70 శాతం రాయితీ, 30 శాతం బ్యాంకు రుణం కలిపించి సగటు యూనిట్ ధర 3 లక్షల రూపాయలతో 91 యూనిట్లు అందించడం జరుగుతుందని తెలిపారు. వ్యవసాయ పథకాలలో సోలార్ యూనివర్సల్ పంప్ కంట్రోల్, వ్యవసాయ అనుబంధ భాగం ను 60 శాతం రాయితీ, 40 శాతం బ్యాంకు రుణం కల్పించి సగటు యూనిట్ ధర 3 లక్షల రూపాయల నుండి 7 లక్షల రూపాయల వరకు 19 యూనిట్లు అందించడం జరుగుతుందని తెలిపారు. అభ్యర్థులు తమ ఆధార్ కార్డు, రేషన్ కార్డు,ఆహార భద్రత కార్డు, కుల ధ్రువీకరణ పత్రం (తెలంగాణ ఏర్పడిన తర్వాత), ఆదాయ ధ్రువీకరణ పత్రం (మీ సేవ ద్వారా జారీ, వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల వారికి 1 లక్ష 50 వేల రూపాయలు, పట్టణ ప్రాంతాల వారికి 2 లక్షల రూపాయలకు లోబడి), వ్యవసాయేతర పథకాలకు అభ్యర్థుల వయసు 21-50 సం.లు, వ్యవసాయ పథకాలకు 21-60 సం.లు ఉండాలని తెలిపారు. శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్ (రవాణా రంగ పథకాలకు), షెడ్యూల్డ్ కులాల పారిశ్రామికవేత్తలు, గిగ్ వర్కర్లకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని, పట్టాదారు పాసు పుస్తకం (సోలార్ పంపు సెట్ కోసం కనీసం 2 ఎకరాల భూమి అవసరం), బోరు బావి, నీటి లభ్యతను నిర్ధారిస్తూ గ్రామ కార్యదర్శి నుండి ధ్రువీకరణ పత్రం సమర్పించాలని, సదరం సర్టిఫికెట్ (దివ్యాంగుల కొరకు), పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఉండాలని తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 24వ తేదీ లోగా ఓబి ఎంఎంఎస్ పోర్టల్ లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని తెలిపారు. ఆన్ లైన్ లో అప్ లోడ్ చేసిన దరఖాస్తులను డౌన్ లోడ్ చేసుకొని సరైన ధ్రువపత్రాలు జత చేసి జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని మొదటి అంతస్తులో గల ఎఫ్-3ఎ బ్లాక్ లోని జిల్లా షెడ్యూల్డ్ కులముల సేవా సహకార అభివృద్ధి సంఘం కార్యాలయంలో అందజేయాలని తెలిపారు. ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: